Home » Accident
రాజస్థాన్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. దౌసా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, నిలిపి ఉంచిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాల్లో మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్ బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది.
జైపుర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు చూసిన తర్వాత గుండె ఒక్కసారిగా ఆగినంత పని అవుతుంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది.
బిహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా బర్హ్ సబ్-డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఔరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.