Home » Dharmavaram
గ్రామ పంచాయతీలు ఆయా గ్రామాలలోని చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి, దానిని రైతుల కు విక్రయించడంద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీల అభివృద్ధికి వినియోగించాలనే ఉద్దేశ్యంతో 2014లో టీడీపీ ప్రభుత్వం చెత్తతో సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటిని ఆయా గ్రామ పంచాయతీ కేంద్రాలలో రూ. లక్షల వెచ్చించి నిర్మించింది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్లో లేక మరే ఇతర కారణాల వల్లనో కాని పెద్దసంఖ్యలో అనారోగ్యానిరి గురయ్యారు. కాగా.. చలి తీవ్రత పెరిగిన నేపధ్యంలో జలుబు, జ్వరాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.
మండలంలోని మల్లేనిపల్లిలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరద్వార ప్రవేశం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ లయ కమిటీ సభ్యులు ఆదివా రం తెలిపారు.
గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉంటే నేరాలు దూరం అవుతాయని డీఎస్పీ హేమంత కుమార్ తెలిపారు. మండలపరిధిలోని ముస్టూరు లో గురువారం రాత్రి డీఎస్పీ హేమంతకుమార్ ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భం గా అయన మాట్లాడుతూ... గ్రామలలో ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే ముందు జాగ్రత్తగా గ్రామ పెద్దల ద్వారా గానీ, పోలీసుల దృష్టికి తీసుకొచ్చి గానీ పరిష్కరించుకోవాలని సూచించా రు.
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది.
బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన చర్చీలు బుధవారం రాత్రి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో పట్టణంలోని ఆయా చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైల్వేస్టేషన క్యాంపస్, మార్కెట్ వీధి, జోగోనికుంట, కొత్తపేట, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, నె హ్రూనగర్లోని చర్చీలు క్రిస్మస్ సందర్భంగా ముస్తాబయ్యాయి.
ఎస్కే యూనివర్శిటీ అంతర్కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు.
జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.