Home » Dharmavaram
డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం జిల్లా గుంతకల్లు మీదుగా వెళతాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
మండలంలోని రావులచె రు వు గ్రామంలో గుర్తుతెలియ ని దుండగులు ఒంటరి మ హిళ వడ్డే లక్ష్మీదేవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీచేశా రు. ఈ మేరకు భాధితురా లు గురువారం రూరల్ పో లీస్స్టేషనలో ఫిర్యాదు చేశా రు. వడ్డే లక్ష్మీదేవమ్మ రెం డు రోజుల క్రితం తన పుట్టి నిల్లు అయిన శెట్టూరుకు పని నిమిత్తం వెళ్లింది.
మండలపరిదిలోని గం టాపురానికి చెందిన నాగేష్ అనే రైతు వ్యవసాయ తోటలో గురువా రం విద్యుత షార్టు సర్క్యూట్ జరిగి చీనీ, అరటి చెట్లు, డ్రిప్ వైరు కాలి పోయినట్లు బాధిత రైతు తెలిపారు. నాగేష్ తన పొలంలో చీనీ, అరటి పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గురువారం ఉదయం విద్యుత షార్టు సర్క్యూట్ అవడంతో విద్యుత తీగల నుంచి అగ్ని రవ్వలు కింద పడి మంటలు వ్యాపించాయి.
మండలకేంద్రంలో గురు వారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికకు 273 ఫిర్యాదులు అం దినట్లు ఆర్డీఓ మహేష్కుమార్ తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ రకాల భూ సమస్యలను తెలుసుకోవడానికి గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయం వద్ద సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు.
గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన అంగనవాడీ వ్యవస్థను తిరిగి మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరి టాలశ్రీరామ్ అన్నారు. ఆయన గురువారం పట్టణంలోని 230 మంది అంగనవాడీ కార్యకర్తలకు, ఎనిమిది మంది సూపర్వైజర్లకు ప్రభుత్వం నుంచి వచ్చిన 5జీ మొబైల్ ఫోన్లను పట్టణంలోని ఎర్రంగుంట టీడీపీ కా ర్యాలయంలో అందజేశారు.
మండలంలోని నేలకోట గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోవడంతో దాని పరిధిలోని మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్ జ్యోతి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉపేంద్ర దాదాపు నెల రోజుల క్రితం లాంగ్లీవ్లో వెళ్లారు.
శ్మశానవాటిక లేకపోవడంతో ఎవరైనా చనిపోతే మా పొలాల్లోనే దహనసంస్కారాలు చేస్తున్నామని, శ్మశానవాటికకు స్థలం కేటాయించి తమ సమస్యను పరి ష్కారించాలని మండలంలోని నేలకోట గ్రామ ఎస్సీకాలనీ వాసులు బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్కు విన్నవిం చారు.
రిథమిక్ యోగాసన పెయిర్ సబ్ జూనియర్స్ విభాగం రాష్ట్రస్థాయి పోటీల్లో మండల కేంద్రం లోని శాంతి ఆనంద పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బొగ్గు రాజశేఖర్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ... యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన ఆఫ్ ఆంధ్రప్రదేశ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అ నంతపురం పీవీకేకే ఇనస్టిట్యూట్లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరిగా యని తెలిపారు.