Home » Dharmavaram
అనంతపురం జిల్లాలో వైసీసీ కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మాజీ ముఖ్యమంత్రతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా రప్పా.. రప్పా.. అంటూ ఆ పార్టీ కార్యకర్తలు చేసిన భీభత్సాన్ని పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది.
బంగ్లాదేశలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని నిరసిస్తూ ధర్మవరంలో బుధవారం రాత్రి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేప ట్టారు. కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి సర్కిల్ మీదుగా సాగింది. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాలలో వెలసిన చర్చీలు బుధవారం రాత్రి సర్వాంగసుందరంగా ముస్తాబయ్యాయి. క్రిస్మస్ పండుగ గురువారం కావడంతో పట్టణంలోని ఆయా చర్చీలను అందంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా రైల్వేస్టేషన క్యాంపస్, మార్కెట్ వీధి, జోగోనికుంట, కొత్తపేట, శ్రీలక్ష్మీచెన్నకేశవపురం, నె హ్రూనగర్లోని చర్చీలు క్రిస్మస్ సందర్భంగా ముస్తాబయ్యాయి.
ఎస్కే యూనివర్శిటీ అంతర్కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు.
జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్, బహుజనసమాజ్ పార్టీ, పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.
దేశంలో హిందూసమాజాన్ని శక్తివంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కదిలిరావాలని, అందుకే హిందూ సమ్మేళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు అఖిలభారత సహ సంఘటక్ దేవేంద్ర, కోణ కణ్వాశ్రమం దత్తానందగిరి స్వామి పే ర్కొ న్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదా నంలో ఆదివారం సాయంత్రం ఆర్ఎస్ఎస్, హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూసమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
డివిజన పరిధిలోని 0-5సంవత్సరాల్లోపు పిల్లలందరికి ఆదివారం పల్స్పోలియో చుక్కలను వేయించాలని ఇనచార్జ్ డిప్యూటీ డీఎంహెచఓ చెన్నారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి పల్స్పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీని వైద్యసిబ్బందితో కలిసి చేపట్టారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానిక మ హాత్మాగాంధీ పేరు తొలగిస్తూ వీజీ జీ ఆర్ ఎంఎం జోగు పేరు పెట్టడపై సీపీఎం, రైతుసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వారు శనివారం స్థానిక గాంధీ నగర్లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.