Vallabhaneni Vamsi: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్.. అయినా జైల్లోనే.. ఎందుకంటే
ABN, Publish Date - May 16 , 2025 | 07:40 PM
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ దొరికింది. ఈ కేసులో బెయిల్ దొరికినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వంశీది...
విజయవాడ: తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) బెయిల్ మంజూరైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు కీలక కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీకి బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇవాళ(శుక్రవారం) సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో వంశీకి రిలీఫ్ వచ్చినా జైలుకే పరిమితం కానున్నారు. నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా వంశీ జైల్లో ఉండనున్నారు. ఈరోజు వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్లో మరో కేసు నమోదైంది.
కాగా.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నూజివీడు కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. విచారణ అనంతరం జడ్జి శ్రావణి వంశీకి రిమాండ్ విధించారు. ఈ కేసులో ఈ నెల 29వ తేదీ వరకు వంశీకి కోర్టు రిమాండ్ విధించింది. ఇదే కేసులో వంశీతో పాటు ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్ రంగారావుకు కూడా కోర్టు రిమాండ్ చేసింది. ఇదిలా ఉండగానే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీపై పీటీ వారెంట్కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. వంశీకి 29వ తేదీ వరకు, మోహన రంగారావుకు 14 రోజుల పాటు నూజివీడు కోర్టు రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 16 , 2025 | 07:45 PM