Buddha Venkanna: బ్యాంకులను మోసం చేసిన కేశినేని నాని
ABN, Publish Date - May 12 , 2025 | 04:06 AM
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని బ్యాంకులను మోసం చేసినట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో ఆధారాలతో ఈ విషయాన్ని వెల్లడించారు
బుద్దా వెంకన్న ధ్వజం.. విలేకరుల సమావేశంలో ఆధారాల ప్రదర్శన
విజయవాడ (వన్టౌన్), మే 11(ఆంధ్రజ్యోతి): విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివా్స (నాని) విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)కి లిక్కర్ స్కామ్తో సంబంధం లేకపోయినప్పటికీ జగన్ మెప్పు కోసం నాని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా లిక్కర్ స్కామ్ నడిచిందని సిట్ తేల్చిందని, వ్యవహారం జగన్ మెడకు చుట్టుకుంటున్నదన్న కారణంగానే కొత్త నాటకానికి నాని తెరతీశారని ఆరోపించారు. దొంగ డాక్యుమెంట్లు, దొంగ అగ్రిమెంట్లతో బ్యాంకులనే మోసం చేసిన చరిత్ర, ఒకే నెంబరుపై పది బస్సులు నడిపిన చరిత్ర ఆయనదన్నారు. నాని మోసాలపై ఈడీ, సీబీఐలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పలు ఆధారాలను విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న ప్రదర్శించారు.
ఇవి కూడా చదవండి..
పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు
Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News
Updated Date - May 12 , 2025 | 04:07 AM