Chevella RTC Bus Incident : మద్యం మత్తులో టిప్పర్ డ్రైవర్.?
ABN, Publish Date - Nov 03 , 2025 | 05:45 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాకూడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్టు మార్టం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 3: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్టు మార్టం నిర్వహించారు. ఇక ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్.. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్ గా గుర్తించారు. అతడి రక్త నమూనాలను కూడా పోలీసులు సేకరించారు. టిప్పర్ ను నడిపే సమయంలో ఆకాశ్ మద్యం మత్తులో ఉన్నాడా?, లేడా అనే విషయం తెలిసేందుకు.. అతడి బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించనున్నారు. కొన్ని గంటల్లో ఆ రిపోర్టు కూడా రానుంది. ఈ రిపోర్టు ఆధారంగా అతడు మద్యం తాగాడా, లేదా అనే దానిపై స్పష్టత రానుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్
చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం
Updated Date - Nov 03 , 2025 | 05:45 PM