Home » Ranga Reddy
రాకెట్లను అంతరిక్షంలోకి పంపిస్తున్న ఈ రోజుల్లోనూ కుల రాకాసి పేట్రేగిపోతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాసులు అనే తేడా లేకుండా కులానికి బానిసలుగా మారి నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది.
అడ్డు వచ్చిన వారిపై దాడులకు పాల్పడుతూ గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వింత సమాధానం చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణ ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్లలో చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో 19 మంది దాకా మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాకూడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. పోస్టు మార్టం నిర్వహించారు.
రోడ్డు చిన్నగా ఉందని.. రోడ్డును వెడల్పు చేస్తే తప్ప ప్రమాదాలు ఆగవని చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు స్పాట్లో మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ బిడ్డల కోసం ఆరా తీయగా.. వారు చనిపోయినట్లు తెలియడంతో గుండెలవిసేలా రోదిస్తున్నారు.
మహేశ్వరం భూదాన్ భూముల వ్యవహారం పై తెలంగాణ హైకోర్టు తీర్పు కీలక తీర్పు ఇచ్చింది. ల్యాండ్ ను కొనుగోలు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సర్వే నెంబర్ 194, 195 భూదాన్ భూమిని అక్రమంగా మ్యుటేషన్ చేసి అన్యాక్రాంతం చేశారంటూ పిటిషనర్ తరఫున లాయర్ హైకోర్టు వాదించారు.
యువతికి అబార్షన్ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకుంది డాక్టర్. అయితే అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి యువతి పరిస్థితి విషమంగా మారింది.