Share News

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jan 19 , 2026 | 09:30 AM

రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Road Accident: ఆరాంఘర్ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం
Road Accident

రంగారెడ్డి, జనవరి 19: జిల్లాలోని ఆరాంఘర్ చౌరస్తాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ.. యాక్టీవాపై వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న వ్యక్తి లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంతో ఆరాంఘర్ చౌరస్తాలో కాసేపు ట్రాఫిక్‌‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అయితే.. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? అనే దానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అట్టహాసంగా నాగోబా జాతర ప్రారంభం..

స్పెయిన్‌లో ఘోర ప్రమాదం.. అతివేగంగా ఢీకొన్న రెండు హైస్పీడ్ రైళ్లు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 09:44 AM