Home » Road Accident
చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుపత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు ఆర్టీసీకి చెందిన రెండు బస్సులు ఢీకొనడంతో 11 మంది మృతిచెందారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ.. మరణించిన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలంగాణలో ఇటీవల ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మహబూబ్నగర్లో జరిగిన ఘటనలో ఇథనాల్ ట్యాంకర్ డ్రైవర్ మృతిచెందాడు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. ఒకరు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన సికింద్రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోటబొమ్మాళి మండలం ఎత్తురాల్లపాడు దగ్గర లారీని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నులుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును నడుపుతున్న డ్రైవర్కు హఠాత్తుగా గుండె పోటు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నియంత్రణ కోల్పోయిన కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాల పైకి దూసుకెళ్లింది. అనంతరం బ్రిడ్జ్ను కూడా ఢీకొట్టింది.
కర్నూలు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు దాటుతున్న పాదచారులను లారీ వేగంగా ఢీ కొట్టింది.