Home » Road Accident
రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అప్ప జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో బండ వికాస్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం అయితంపూడి లాకుల వద్ద ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెరవలిలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది.
సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి-65పై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం అనాతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్పేట్ ఫ్లై ఓవర్పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది.
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కుమారుడు అమీన్ కారు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో అమీన్తో పాటు అయన మిత్రుడికి గాయాలయ్యాయి.
హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్ ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు.
అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హిమాచల్ప్రదేశ్ చంబా జిల్లాలోని చలువజ్ మోర్ సమీపంలో తిస్సా - బైరాగఢ్ రహదారిపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు.