Share News

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి

ABN , Publish Date - Feb 16 , 2026 | 10:15 AM

బెంగుళూరు శివారు తమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

తీవ్ర విషాదం.. బస్సును ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
Bengaluru Car Accident

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కేఎస్ఆర్టీసీ బస్సును కారు ఢీకొని ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన బెంగళూరు శివారు తుమకూరు రోడ్డులోని జిందాల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారు డివైడర్‌ను ఢీకొట్టి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కేఎస్ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు‌నుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్సపొందుతూ అతను మరణించాడు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నేలమంగళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి..

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

రాజమండ్రిలో పెద్ద పులి భయం.. ఫారెస్ట్ బృందం చర్యలు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 16 , 2026 | 11:27 AM