Home » Karnataka
సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా డీకే-డీకే అంటూ నినాదాలు చేశారు.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎమ్మెల్యే కృష్ణ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కేవలం.. నాటుకోడి, చికెన్ సూప్కే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కన్నడ నాట తీవ్ర సంచలనానికి దారితీశాయి. కాగా.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు మండిపడున్నాయి.
కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ మిగతా పదవీకాలం రెండున్నరేళ్లలో ఎవరు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలనే అంశం రసకందాయంలో పడింది. ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరుగగా, ఇవాళ..
నాయకత్వ మార్పుపై అందరిలోనూ గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటీవల తన నివాసంలో డీకేకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. రెండో రౌడ్ బ్రేక్ఫాస్ట్ చర్చలు ఈసారి డీకే నివాసంలో జరిగాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కర్ణాటక స్టార్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. పడిక్కల్ మెరుపు శతకం దెబ్బకు కర్ణాటక జట్టు 145 పరుగుల తేడాతో తమిళనాడుపై ఘన విజయం సాధించింది.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
ఇవాళ ఢిల్లీలో సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలతో స్ట్రాటజీ గ్రూప్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కర్నాటక రాజకీయాల్ని కొత్త మలుపు తిప్పవచ్చు.
ఆర్థికశాస్త్రంలో నిపుణులైన మన్మోహన్ను ప్రభుత్వాధిపతిగా సోనియాగాంధీ ఎన్నుకున్నారని, ఆశా వర్కర్ల స్కీమ్ వంటి పలు సంక్షేమ చర్యల్లో ఆమె నాయకత్వ శైలి కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని డీకే శివకుమార్ పేర్కొన్నారు.
సీఎం పోస్టుపై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తుండగా, డీకే మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుందన కర్ణాటక రైతుల సమస్యలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తెచ్చేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పారు.