Home » Karnataka
బెంగళూరు నగరంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల గ్యాస్ స్టేషన్లలో నో స్టాక్ బోర్డు పెట్టారు.
కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ నర్స్ ఆత్మహత్య చేసుకుంది. 4 నెలల గర్భంతో ఉన్న ఆమె తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయింది.
‘నేను ముఖ్యమంత్రిని అయితే వెంటనే ముస్లింలను మైనారిటీ జాబితా నుంచి తొలగిస్తానని’ బీజేపీ నుంచి సస్పెన్షన్ వేటుపడిన విజయపుర ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యానించారు.
కర్ణాటకలోని చిక్కబళ్ళాపుర జిల్లా శెట్టిగర క్రాస్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి రక్షితా రెడ్డి(23), ఆమె బంధువు పవన్ రెడ్డి(26) మృతిచెందారు.
ప్రముఖ కన్నడ నటుడు, దర్శక నిర్మాత రక్షిత్ శెట్టి నిర్వహిస్తున్న పరంవా స్టుడియోస్కు ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల జరిమానా విధించింది.
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల ద్వారా మాత్రమే ప్రగతి సాధిస్తుందని, ఏ ఒక్క వ్యక్తితోనో ముందుకు వెళ్లదని, అది సీఎం సిద్దరామయ్య అయినా మంత్రి జమీర్ అయినా ఒక్కటేనని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు.
కర్ణాటకలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాలేజీ ప్రొఫెసర్, తోటి విద్యార్థినుల వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ప్రొఫెసర్తో ఎఫైర్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేయటంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి ఈ దారుణమైన నిర్ణయం తీసుకుంది.
కుక్కలు, పిల్లలు, పాడి జంతువులతో మాత్రమే కాదు.. కోతులతో కూడా మనుషులకు విడదీయరాని బంధం ఉంది. కోతులు కూడా కుక్కల్లానే తిండి పెట్టిన మనిషికి విశ్వాసంగా ఉంటాయి. వారిపై ఎంతో ప్రేమ చూపిస్తాయి.
తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల పనులను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలించారు. కొత్త గేట్లను బిగించేందుకు జరుగుతున్న పనులను సైట్ నుంచే సీఎంకు చంద్రబాబుకు ఫోన్ చేసి వివరించారు మంత్రి.
గుడి పరిసరాల్లో షూ వేసుకుని ఫొటోలు, వీడియోలు తీస్తున్నారంటూ జనం ఫొటోగ్రాఫర్లపై దాడి చేశారు. విచక్షణా రహితంగా చావ కొట్టారు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.