Kashibugga Incident: తొక్కిసలాట ఘటనపై విచారణ కమిటీ ఏం తేల్చబోతుంది.?
ABN, Publish Date - Nov 02 , 2025 | 01:29 PM
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు. కమిటీలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, శ్రీకాకుళం ASP కేవీ రమణ, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్ ఉన్నారు. తొక్కిసలాటకు గల కారణాలను పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Nov 02 , 2025 | 01:29 PM