Home » Srikakulam
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు చేసిందేమీ లేదని ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి మత్స్యకారులకు వలలు, బోట్లకి సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.
పిల్లలకు పాఠాలు చెప్పడం మాని, వాళ్ల చేత కాళ్లు నొక్కించుకున్న టీచర్కు షోకాజ్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని ఐటీడీఏ సీతంపేట పీవో పవార్ స్వప్నిల్ ధృవీకరించారు. దీనిపై విచారణకు ఆదేశించామని..
కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం.. తొక్కిసలాట ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించింది.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.
కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎస్పీ సహా పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమగ్ర విచారణకు హోంమంత్రి ఆదేశించారు.
కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు.
తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
కాశీబుగ్గ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాశీబుగ్గ ఘటన తీవ్రంగా కలచివేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.