ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఆ జీవోపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jul 21 , 2025 | 05:03 PM

తెలంగాణ రైజింగ్-2047పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అభివృద్ధి, పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy

హైదరాబాద్: కొమరం భీమ్ కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రకటించిన జీవో నెంబర్ 49ను రేవంత్ ప్రభుత్వం నిలిపేసింది. జీవో నెంబర్ 49ను నిలుపుదల చేయాలని అధికారులని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy). ఆదివాసి ప్రజల అనుమానాలు, ఆందోళనల నేపథ్యంలో జీవో నెంబర్ 49ను నిలుపుదల చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డినీ కలిసి మంత్రి సీతక్క, ఆదివాసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రైజింగ్‌పై ఫోకస్..

మరోవైపు.. తెలంగాణ రైజింగ్-2047పై (Telangana Rising - 2047) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందుకు అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ (ATC) అభివృద్ధి, పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ(సోమవారం) కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులు, శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఏటీసీల అభివృద్ధి, పనుల్లో పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏటీసీల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

ఏటీసీల అభివృద్ధి, పురోగతిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో 111 ఏటీసీలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు అధికారులు. ఫేజ్-1లో 25, ఫేజ్-2లో 40, ఫేజ్-3లో 46 ఏటీసీలని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఫేజ్-1, ఫేజ్-2లో ఇప్పటి వరకు 49 ఏటీసీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు అధికారులు. ఏటీసీలను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైతే నైపుణ్యం కలిగిన నిర్మాణ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి. జీనోమ్ వ్యాలీలో ఒక మోడల్ ఏటీసీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించే కోర్సులు అక్కడ నిర్వహించాలని సూచించారు. అవసరమైన స్థలం కేటాయింపుతో పాటు అధునాతన సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

గిగ్ వర్కర్స్ పాలసీపై సమీక్ష

గిగ్ వర్కర్స్ పాలసీపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. గిగ్ కార్మికులకు ప్రతిపాదిత పాలసీని సమీక్షలో ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. గిగ్ వర్కర్స్‌కు చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించారు అధికారులు. సంక్షేమబోర్డు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదనలు చేశారు. గిగ్ కార్మికుల పాలసీపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. గిగ్ కార్మికులకు సంబంధించిన పూర్తి డేటా ఆన్‌లైన్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. సంక్షేమ నిధి ఏర్పాటు చేయడంతో పాటు గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్స్‌రెన్స్ సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

వారికి గుడ్‌న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్థానిక ఎన్నికలపై హరీష్‌రావు కీలక వ్యాఖ్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 06:20 PM