Home » Congress Govt
KTR: రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ నిర్ణయాలతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను రేవంత్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
అందాల పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి మద్యం సీసాలపై లేబుల్స్ కాంట్రాక్టు ఇచ్చిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
రాజీవ్ యువ వికాసం పథకంలో లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పథకం జూన్ 2న అమలులోకి రానుందని తెలిపారు.
టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకులు ఢిల్లీలో తుది చర్చలు జరుపుతున్నారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు కొత్త పదవి కావాలంటే రాజీనామా చేయాలన్న నిబంధన అమల్లోకి వస్తోంది.
బీఆర్ఎస్ నాయకత్వ బాధ్యతలు కేటీఆర్కు అప్పగిస్తే స్వాగతిస్తానని హరీశ్ రావు అన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఉద్యోగులను ప్రజల ముందుకు దోషులుగా చూపించిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలు ప్రకటించాలని, బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కాళేశ్వరంలో శ్రీ మాధవానంద సరస్వతి పుష్కరాలు రేపు ప్రారంభం. 17 అడుగుల ఏకశిల విగ్రహాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు.
ఆర్థిక శాఖ పూర్తి బాధ్యతలు ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియాకు అప్పగించారు. సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్బజార్ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.