Home » Congress Govt
హైదరాబాద్ జిల్లాలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా కల్పించారు. L1 కింద 4,800 మందికి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
ధరణి దోపిడీపై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ధరణి వ్యవహారంలో తీగ లాగితే డొంక కదిలినట్లు అక్రమాలు బయటపడుతున్నాయని చెప్పుకొచ్చారు.
డేటా సెంటర్ల భూ సేకరణ పురోగతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సచివాలయంలో ఇవాళ(మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా సెంటర్లకు రాయితీలపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు..
మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్ దాడులకు దిగిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఇవాళ (మంగళవారం) ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
నిజామాబాద్ కార్పొరేషన్ను తామే కైవసం చేసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డితో శనివారం సమావేశం అవుతానని.. ఈ భేటీలో కార్పొరేషన్ల గురించి చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేయడం సంచలనంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దారుణాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..