Home » CM Revanth Reddy
పేదలకు రేవంత్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయలేక రేవంత్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇది కేడీల రాజ్యం.. బేడీల రాజ్యం అని, సీఏం ఎనుముల రేవంత్రెడ్డి కాదు.. కోతల రేవంత్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డయాలసిస్ పేషెంట్లకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధమైంది. మే నెలలో 4021 మంది డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్లను ప్రజా ప్రభుత్వం మంజూరు చేసింది.
రాష్ట్రంలో కేడీలు, బేడీల రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి హరీష్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా వన్ రేస్ని రాష్ట్రానికి తెచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ని కూడా రేవంత్ ప్రభుత్వం సతాయించిందని హరీష్రావు అన్నారు.
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు..
తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.
గోదావరిలో వరద జలాలు ఉన్నాయని ఏపీ నిజంగా భావిస్తే.. పోలవరం - బనకచర్లకు బదులు కేంద్రం నిధులు ఇచ్చే ఇచ్చంపల్లి - నాగార్జున సాగర్ అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు నీళ్లు తీసుకెళ్లే విషయమై చర్చకు మేం సిద్ధం’- కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ సందర్భంగా గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది.
గోదావరి - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. ఈనెల 23న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి క్రీడా స్టేడియంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. తెలంగాణ యుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిందని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. గతంలో ఏపీకి అన్ని హక్కులు రాసిచ్చారని ఆరోపించారు.