Kishan Reddy: బేగంపేట రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి
ABN, Publish Date - May 22 , 2025 | 03:10 PM
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడు అమృత్ భారత్ స్టేషన్లను ప్రధాని మోదీ గురువారం నాడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బేగంపేట రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పారు.
దేశంలో 1,300 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు.
2026లో 40 రైల్వేస్టేషన్లు అభివృద్ధి జరగబోతున్నాయని కిషన్రెడ్డి ప్రకటించారు.
బేగంపేట రైల్వేస్టేషన్లలో మహిళలే పనిచేయబోతున్నారని తెలిపారు.
తెలంగాణలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.
రూ.80వేల కోట్ల పనులకు సంబంధించిన ప్లాన్లు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
Updated Date - May 22 , 2025 | 03:15 PM