Home » PM Modi
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.
అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని మోదీ చెప్పారు.
పశ్చిమబెంగాల్లో టీఎంసీ 'మహా జంగిల్ రాజ్'కు బీజేపీ చరమగీతం పాడుతుందని మోదీ అన్నారు. అవినీతి, ఆశ్రితపక్షపాతం, బుజ్జగింపు రాజకీయాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయని ఆరోపించారు.
బెంగాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వర్చువల్గా ఆ కార్యక్రమానికి హాజరై పలు అభివృద్ధి పనులను ప్రారంభించారాయన.
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బుధవారం ఇథియోపియా అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని మోదీ.. మరుసటి రోజే మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
ఇథియోపియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ దేశాన్ని సింహాల గడ్డగా అభివర్ణించారు. అక్కడ ఉన్ననూ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఉన్నట్టుందని చెప్పుకొచ్చారు మోదీ.
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ మరో గౌరవం పొందారు. ఆయనకు ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం లభించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన సమావేశంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని మాత్రమే చెప్పారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మోదీ కోరారని తెలిపారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..