Home » kishan reddy
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం.రఘునందర్ రావు మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురించి అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైన ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి కోరారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరగనుందని తెలిపారు. ఎయిర్పోర్టు మాదిరిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు జరుగుతాయని వెల్లడించారు.
తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్రం రూ.619.85 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిధుల్లో రూ.371.91 కోట్లు టైడ్ గ్రాంట్, రూ.247.94 కోట్లు అన్ టైడ్ గ్రాంట్ కింద ఉన్నాయన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సుదీర్ఘ కాలం అజారుద్దీన్ దేశానికి సేవలు అందించిన వ్యక్తి అని కొనియాడారు.
పటేల్ చొరవతోనే తెలంగాణలో మూడు రంగుల జెండా ఎగిరిందని కిషన్ రెడ్డి తెలిపారు. నిజాం నిరంకుశత్వంపై ఉక్కు పాదం మోపిన ఘనుడు పటేల్ అని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్లో మజ్లిస్, బీజేపీకి మధ్యే పోటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీకి వేయకుంటే మజ్లిస్ సీట్లు 8 అవుతాయని పేర్కొన్నారు.
'ఇవ్వాలా బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపట ఎక్కడున్నారో కొద్ది చెప్తారా కిషన్ రెడ్డి. నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదు. నేను హిందూత్వం గురించి మాత్రమే మాట్లాడుతాను.'
ఇవాళ మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే చాలామంది మీ మేలు కోసం ఎదురుచూస్తున్నారు. నా జిల్లాని సర్వనాశనం చేసి నన్ను బయటి పంపించారు మీరు కూడా ఏదో ఒక రోజు వెళ్తారు పక్కా.' అంటూ.. రాజాసింగ్ మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేశారు.
విజయవాడ, బెంగుళూరు, నాగపూర్, బాంబే వంటి అన్ని రాష్ట్రాలకు అద్భుతంగా జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల ఏర్పాటు ద్వారా వెనుకబడిన గ్రామాలు అభివృధి చెందుతున్నాయని తెలిపారు.