Telangana BC Bandh: తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ నిరసనలు..
ABN, Publish Date - Oct 18 , 2025 | 01:44 PM
తెలంగాణ రాష్ట్రంలో బీసీ బంద్ కొనసాగుతున్న వేళ.. నగరాలు, పట్టణాలలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ బంద్కు అన్ని పార్టీలో మద్దతు తెలపడంతో.. బంద్ ప్రశాతంగా కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో విద్యాసంస్థలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బీసీ బంద్ కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బంద్కు మద్దతు తెలిపారు. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వనపర్తి జిల్లా కేంద్రాల్లోని ఆర్టీసీ డిపో వద్ద వివిధ పార్టీ సంఘాల నాయకులు బైఠాయించారు. అనంతరం పలు ప్రధాన రహదారులు చౌరస్తాల వద్ద బైక్ ర్యాలీలో ధర్నాలు చేపట్టారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్ కొనసాగుతోంది. దీంతో యాదగిరిగుట్ట డిపోలకే బస్సులు బంద్ పరిమితం అయ్యాయి.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బైఠాయించారు. బీసీ బంద్లో భాగంగా బీసీ సంఘాల నాయకులు మద్దుతు తెలుపుతూ.. నిరసన వ్యక్తం చేశారు.
బీసీ బంద్ సందర్భంగా హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద బీసీ నాయకులు నిరసన తెలిపారు. బంద్ కారణంగా ఎంజీబీఎస్లో బస్సులో నిలిపివేయడంతో ప్రయాణికుల ఇబ్బందులు పడ్డారు.
సిద్దిపేటలో బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బస్ డిపో వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని భూపాలపల్లి జిల్లాలో బీసీ నాయకులు ఆందోళన చేపట్టారు. బస్ డిపో ముందు బస్సులు బయటకు రాకుండా ధర్నా చేపట్టారు.
Updated Date - Oct 18 , 2025 | 01:52 PM