Home » BJP
Telangana: ఆర్ఎస్ఎస్ భావజాలం, బీజేపీ విధానం రిజర్వేషన్లు రద్దు చేయడమే అని.. ఆర్ఎస్ఎస్ ఆలోచనను దేశంపై రుద్దాలనే కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... రిజర్వేషన్లు రద్దు కోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వంద సంవత్సరాల్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆర్ఎస్ఎస్ కంకణం కట్టుకుందన్నారు.
Andhrapradesh: ‘‘రాష్ట్రానికి రాజధాని లేదు. - రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదు...మన రాష్ట్రానికే ఈ దుస్థితి. మనకు చేతిలో చిప్ప తప్పా ఏమి లేదు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... జగన్, చంద్రబాబు, మోదీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపట్టారు.
ప్రధాని మోదీ మైనార్టీలను వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తెలంగాణా మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్(Former Governor of Telangana Tamilisai Soundarrajan) పేర్కొన్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ ఎదుట ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం - వందేళ్ల విధ్వంసం’’ అంటూ..
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి దశకు చేరింది. నేటితో ఆ ప్రక్రియ ముగియనుంది. దీంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతోపాటు ఓటర్లకు డబ్బులు పంచేందుకు తగిన వనరులను సమకూర్చుకునే పనిలో ఉన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా తన సొంత అభ్యర్థికే ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుందా? అసలు అలాంటి సందర్భం ఎప్పుడైనా చోటు చేసుకుందా? గతం సంగేతేమో కానీ.. తాజాగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా అలాంటి విచిత్ర పరిణామం వెలుగు చూసింది. రాజస్థాన్లోని గిరిజనులు అధికంగా..
పార్లమెంట్ పరిధిలోని ప్రజలను పూర్తిస్థాయిలో కలిసేలా అభ్యర్థులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంటింటి ప్రచారం ఏ ప్రాంతాల్లో చేయాలి, వాకర్లు, కాలనీ, బస్తీ సంఘాలతో సమావేశాలు ఎప్పుడు నిర్వహంచాలి, అగ్రనేతలతో రోడ్ షోలు, క్షేత్రస్థాయి ప్రచారం ఎక్కడ చేయాలి అన్న దానిపై ముఖ్యనేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(BJP candidate Kompella Madhavilatha) బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Rajasingh) ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గురువారం ఉదయం 47 డివిజన్ కొండ ప్రాంతంలో సుజనాచౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ప్రత్యేక కార్యాచరణతో సమస్యలు పరిష్కరిస్తామని సుజనా చౌదరి హామీ ఇచ్చారు.