CM Revanth: సఫ్రాన్ ఎమ్ఆర్వో నూతన సెంటర్ ప్రారంభం.. పాల్గొన్న సీఎం రేవంత్
ABN, Publish Date - Nov 26 , 2025 | 01:43 PM
శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ సంస్థ సఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ ఎమ్ఆర్వో సెంటర్ను ఈరోజు (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి శ్రీధర్ పాల్గొన్నారు.
శంషాబాద్ సమీపంలోని జీఎంఆర్ ఏరోపార్క్ (SEZ)లో సఫ్రాన్ నెలకొల్పుతున్న LEAP ఇంజిన్ ఎమ్ఆర్వో సెంటర్ను ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ను ఎంచుకున్న సఫ్రాన్కు సీఎం అభినందనలు తెలియజేశారు.
ఎమ్ఆర్వో సెంటర్ ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అన్నారు.
రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఎమ్ఆర్వో సెంటర్ ద్వారా 1,000 మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
సఫ్రాన్కు చెందిన ఎమ్88 మిలిటరీ ఇంజిన్ ఎమ్ఆర్వోకు కూడా శంకుస్థాపన జరిగిందన్నారు సీఎం.
ఈ ఎమ్ఆర్వో భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఏరోస్పేస్ పెట్టుబడులను ఆకర్షించడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన ప్రమాణమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.
భారతదేశంలోని ప్రముఖ ఎమ్మార్ఓ, ఏరో ఇంజిన్ హబ్లలో హైదరాబాద్ ఒకటన్నారు సీఎం రేవంత్.
బెంగళూరు-హైదరాబాద్ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధానమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - Nov 26 , 2025 | 01:43 PM