Home » Rammohannaidu Kinjarapu
గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్గా సర్వీసులను ప్రారంభించారు.
దేశంలో నగర వైమానిక రవాణా రంగంలో ఒక సరికొత్త శకానికి తెరలేవబోతోంది. 2028 నాటికి దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయన్నారు.
దేశీయ రక్షణ, విమాన తయారీ రంగాల్లో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. తొలి స్వదేశీ ఎయిర్బస్ సీ-295 వ్యూహాత్మక సైనిక రవాణా విమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిచయం చేశారు.
భోగాపురం ఎయిర్పోర్టు పనులను వేగంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అనుకున్న సమయానికే జీఎంఆర్ సంస్థ ఎయిర్పోర్టును నిర్మించిందని చెప్పారు.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లాలో రాజకీయం చేయాలంటే పీహెచ్డీ కావాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజకీయం పుట్టింది గుంటూరులో అంటారని, మరొక 30 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో సూపర్ సిక్స్ హామీలు విజయవంతంగా అమలు చేశామన్నారు.
పర్యావరణ ప్రభావం మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం మీద ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు.
విశాఖ జోన్ కోసం పార్లమెంట్లో అనేక పర్యాయాలు పోరాడానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు.