Home » Duddilla Sridarbabu
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి ఐఏఎస్ ఆఫీసర్ శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
సింగరేణి కార్మికుడి శ్రమ, చెమటని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు మాట్లాడుతున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై చేస్తున్న ఆరోపణలతో తన మనసు కలచి వేసిందని.. అందుకే అధికారులతో కలిసి ఓపెన్హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మలేషియా కంపెనీలు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేలా ముందుకు రావాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్సీడీఏ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని మండిపడ్డారు.
కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ రైజింగ్తో త్రీ ట్రిలియన్ ఎకానమీ కోసం తాము పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు. జహీరాబాద్ లాంటి ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ కేవలం ఐటీ డెస్టినేషన్గా మాత్రమే కాకుండా.. ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో హై లెవల్ డెలిగేషన్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు.