CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డితో బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ కీలక భేటీ
ABN, Publish Date - Sep 18 , 2025 | 09:18 PM
భారత్లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ , డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇవాళ (గురువారం) కమాండ్ కంట్రోల్ సెంటర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
భారత్లోని బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ , డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమి అడ్వైజర్ నళిని రఘురామన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఇవాళ (గురువారం) కమాండ్ కంట్రోల్ సెంటర్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ ( Chevening scholarship)ను కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించాలని సీఎం రేవంత్రెడ్డి కోరగా.. బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ అంగీకరించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తీసుకురాబోతున్న నూతన విద్యా పాలసీ గురించి చర్చించారు.
నూతన విద్యా పాలసీపై సీఎం రేవంత్రెడ్డి పలు కీలక సూచనలు చేశారు.
ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ తెలిపారు.
అలాగే, మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధిపై కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటీష్ కంపెనీలు భాగస్వాములు కావాలని కోరారు సీఎం రేవంత్రెడ్డి.
అలాగే జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ విభాగాల్లో పెట్టుబడులకు బ్రిటీష్ కంపెనీలు ముందుకు రావాలని సూచించారు సీఎం రేవంత్రెడ్డి.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదనలకు బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు.
Updated Date - Sep 18 , 2025 | 09:26 PM