Home » Britain
భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో నాగా మానవ అవశేషాల వేలం వేయలనే నిర్ణయాన్ని బ్రిటన్ విరమించుకుంది. బ్రిటన్లో నాగా మానవ అవశేషాలను బుధవారం అన్ లైన్ వేలం వేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈ వేలం వేయడంపై భారత్లోని ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
బ్రిటీష్(Britain) టెక్నాలజీ టైకూన్ మైక్ లించ్(Mike Lynch) ఇక లేరు. ఓ కేసులో నిర్దోషిగా విడుదలైన సందర్భంగా ఆయన తన భార్య, కుమార్తెతోపాటు పలువురు కలిసి విహారయాత్రకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆగస్టు 19న ఇటలీలోని సిసిలీ తీరం తుఫానులో ఆయన విలాసవంతమైన పడవ మునిగిపోయింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. రాహుల్ గాంధీ 2003లో బ్రిటీష్ పౌరసత్వం తీసుకున్నారని, లండన్లో బ్యాక్ఆప్స్ అనే కంపెనీని కూడా స్థాపించారని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు.
వలసదార్లకు వ్యతిరేకంగా బ్రిటన్ వ్యాప్తంగా పరమ ఛాందసవాద సంస్థలు తమ ఆందోళలను ఉధృతం చేశాయి. పలు చోట్ల అల్లర్లు, ఘర్షణలు చోటు చేసుకోవడంతో పోలీసులు కనీసం వంద మందిని అరెస్టు చేశారు.
సాధారణంగా కార్ పార్కింగ్ బిల్లు అంటే ఏ వందో, రెండు వందలో ఉంటుంది. విమానాశ్రయం, షాపింగ్ మాల్స్ వంటి ప్రీమియం ఏరియాల్లో వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు. అయితే బ్రిటన్కు చెందిన ఓ మహిళ పార్కింగ్ నిబంధనలు అతిక్రమించినందుకు ఏకంగా రూ.11 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.
యూకేలో ఓ భారత సంతతి మహిళ ఖరీదైన షాపుల్లో సిబ్బందిని బురిడీ కొట్టించి ఏకంగా రూ.5 కోట్ల మేర దోచుకుంది. ఆమె నేరాలను చూసి ఏకంగా పోలీసులే షాకైపోయారు.
బ్రిటన్ రాజవంశ వారసులు విలియం, ప్రిన్స్ హ్యారీ మధ్య మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తన తల్లి ప్రిన్సెస్ డయానా ఆభరణాలను సోదరుడి భార్య మెర్కెల్ ధరించకుండా విలియం అడ్డుకున్నారని తెలిసింది. ఈ విషయం రచయిత రాబ్ జాబ్సన్ రాసిన ‘కేథరిన్.. ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో రాశారు. ఆ పుస్తకంలోని వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దేశాల అధినేతలు, అధ్యక్షులు, రాజ కుటుంబీకులు పర్యటించిన సమయంలో ఆతిథ్య దేశం విందు ఇవ్వడం కామన్. బ్రిటన్ రాజ కుటుంబీకులు వస్తే ఖర్చు గురించి చెప్పక్కర్లేదు. రాజ కుటుంబానికి ఫ్రాన్స్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేసింది. ఒక్క పూట భోజనం కోసం గ్రాండ్గా ఏర్పాటు చేసింది. ఇరు దేశాల అధికారులు, ప్రతినిధులు, డెలిగేట్స్, సినీ తారలు కలిపి 150 మందికి పైగా పాల్గొన్నారు. ఫ్రెంచ్ ఫుడ్, రకరకాల డిషెస్, వైన్, స్విట్ సర్వ్ చేశారు. ఖర్చు ఎంతయ్యిందో అనే విషయం ఆడిట్లో తేలింది.
బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికైన పలువురు భారతీయ ఎంపీలు ప్రమాణ స్వీకారం సందర్భంగా తమ ప్రత్యేకత చాటుకున్నారు.
బ్రిటన్(Britain) సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఈ పార్టీకి చెందిన కియర్ స్టార్మర్ (61)(Keir starmer) బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. 61 ఏళ్ల కైర్ స్టార్మర్ ప్రధాని అయితే బ్రిటన్ చరిత్రలో గత 50 ఏళ్లలో 60 ఏళ్లు పైబడిన వ్యక్తి దేశ ప్రధాని కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.