ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Arrive Alive Program: రోడ్డు భద్రతపై హైదరాబాద్‌లో అరైవ్ అలైవ్ కార్యక్రమం

ABN, Publish Date - Nov 15 , 2025 | 08:10 AM

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అరైవ్ అలైవ్ కార్యక్రమం ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు. ఈ ప్రోగాంకి వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలి వచ్చారు.

1/13

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అరైవ్ అలైవ్ కార్యక్రమం ఎల్‌బీ స్టేడియంలో శుక్రవారం నాడు జరిగింది.

2/13

ఈ కార్యక్రమంలో ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు.

3/13

ఈ ప్రోగాంకి వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలి వచ్చారు.

4/13

శుక్రవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు ఎల్‌బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.

5/13

రోడ్డు ప్రమాదాలను తగ్గించటం, బాధ్యతా యుతంగా డ్రైవింగ్ చేయడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

6/13

అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.

7/13

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్, పోలీస్ ఉన్నతాధికారులు , హీరో తేజ సజ్జా, ఆది సాయి కుమార్ , శర్వానంద్, యాంకర్ సుమ, డైరెక్టర్ బుచ్చిబాబు, బాబు మోహన్, తదితరులు హాజరయ్యారు.

8/13

పోలీసు శాఖ, రవాణా శాఖ, కార్పొరేట్ సంస్థలు, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.

9/13

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

10/13

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని సీపీ సజ్జనార్ తెలిపారు.

11/13

తెలంగాణలో ఏడాదిలో నాలుగున్నర లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు సీపీ సజ్జనార్.

12/13

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో లక్షమందికి పైగా చనిపోతున్నారని సీపీ సజ్జనార్ వివరించారు. హైదరాబాద్‌లో ఏడాదిలో 3500 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఈ ఘటనల్లో 300 మందికిపైగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

13/13

స్పెషల్ టీమ్స్‌తో రోడ్డు ప్రమాదాలను నివారిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 02:42 PM