Tirumala Brahmotsavalu:తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ABN, Publish Date - Sep 23 , 2025 | 09:14 PM
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. ఏపీ పోలీస్ శాఖ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు.
వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యం ఉంది.
విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు.
ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
సూర్యుడు అస్తమించిన తర్వాతే అంకురార్పణ నిర్వహిస్తారు.
జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చంద్రుడిని ‘సస్యకారక’ అంటారు.
ఈ కారణంగా పగటివేళ అంకురాలను ఆరోపింపచేయడం తగదు.
సాయంత్రం వేళ మంచి ముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు.
అంకురార్పణంలో పలు పవిత్ర విత్తనాలు నాటడం తెలిసిందే.
అంకురార్పణంలో నాటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి.
విత్తనాలు బాగా మొలకెత్తడం వల్ల ఉత్సవాలు కూడా గొప్పగా నిర్వహించబడతాయి.
విత్తనాలు నాటేందుకు పాలికలు అనే మట్టి కుండలను వినియోగిస్తారు. యాగశాలలో ఈ మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. అత్రి అనే మహర్షి తన ‘సముర్తార్చన అధికరణ’ అనే గ్రంథంలో అంకురార్పణ క్రమాన్ని రచించాడు.
Updated Date - Sep 23 , 2025 | 09:15 PM