Home » Tirupati
2019 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి నడిపిన ‘పింక్ డైమండ్ పాయె’ నాటకమే దీనికి నిదర్శనం.
Andhrapradesh: ‘‘పీలేరు ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్.. ఇక్కడ పెద్దిరెడ్డిదే రాజ్యం. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిల కన్ను సన్నులో ఎమ్మెల్యే పని చేస్తాడు.. పెద్దిరెడ్డి ఏం చెప్తే..దాని ఎమ్మెల్యే అమలు చేస్తాడు’’ అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం. పీలేరు బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చిత్తూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలో పర్యటించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ పాలన తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు వసూలు రాజాలుగా మారిపోయారని మట్టి, ఇసుక, భూ కబ్జాలతో పేట్రేగిపోతున్నారని విమర్శించారు.
తాను ఐఏఎస్ అధికారినంటూ శ్రీవారి దర్శనానికి లేఖ సమర్పించిన ఓ నకిలీ ఐఏఎస్ను(IAS) తిరుమల(Tirumala) పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన నరసింహమూర్తి బుధవారం తిరుమలకు వచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీ హోదాతో ఉన్న గుర్తింపుకార్డును చూపి 11వ తేదీకి నాలుగు ప్రొటోకాల్ వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు...
తిరుపతిలో డూప్లికేట్, దొంగ ఓట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కే మీనాకు జనసేన, బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ నేత భాను ప్రకాశ్ మాట్లాడుతూ.. దొంగ ఓట్లు నమోదు చేయించుకుని ఈ ఎన్నికల్లో గెలిచేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
Andhrapradesh: తిరుపతిలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత రోజులుగా ఏనుగుల హల్చల్తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Andhrapradesh: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజీపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి సంచనల ఆరోపణలు చేశారు. ఈవోపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. తిరుమలలో ఉండి స్వామి వారికి సేవలు చేయాల్సిన టీటీడీ ఈవో అధికార పార్టీ సేవలో తరిస్తున్నారని మండిపడ్డారు. ఆయనపైన పూర్తి సాక్ష్యాధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల్లో నివసించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం) రవీంద్రారెడ్డి తెలిపారు.
తిరుపతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశయ సాధన కోసం ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞను నిజం చేయడం కోసం మహా కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేస్తామని తిరుపతి టీడీపీ ఇన్చార్జ్ సుగుణమ్మ స్పష్టం చేశారు.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ప్రజాగళం యాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కూటమి అభ్యర్ధి నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.