Home » Tirupati
దిత్వా తుఫాను వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పుసుపుధార డ్యాములు 98 శాతం నిండిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అద్భుతమైన తిరుపతి, తిరుమల ఫొటోలు, వీడియోలతో పాటు... దర్శన, వసతి, టీటీడీ నూతన నిర్ణయాలు, ప్రసాదాలు, చేపడుతున్న మార్పులు వంటి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తూ... సోషల్ మీడియా సేవ చేస్తున్నారు తిరుపతికి చెందిన కొందరు యువకులు.
తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.
కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖపట్నానికి గూగుల్ సంస్థ రావడంతో పెద్ద గేమ్ ఛేంజర్గా మారబోతోందన్నారు. ఆంధ్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకు పోతుందన్నారు.
రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
విశాఖపట్నం-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ సహా ప్రధాన రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ వాల్తేరు సీనియర్ డీసీఎం కె.పవన్కుమార్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గోదావరి-రాజమండ్రి, రాజమండ్రి-కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో జనవరిలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని
శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ పెంచేలా పనిచేశాను తప్ప.. దేవుడి విషయంలో ఏ తప్పు చేయలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. స్వామి వారి లడ్డూ ప్రసాద విషయంలో తనపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఒకటి నీకు.. మరొకటి నాకు అన్నట్లుగా తిరుపతిలోని రాజకీయ పార్టీల నేతలు ఒక్కటైపోయారు. సిండికేట్ గా మారి షాపులను పంచుకున్నారు. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు సిఫారసు లేఖలతో రెండు మెడికల్ షాపులను నామమాత్రపు అద్దెకు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వివరాలిలా ఉన్నాయి.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు బుధవారం నుంచి 20 బోగీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అదనంగా మరో 312 సీట్లు ప్రయాణికులకు అందుబాట్లోకి రానున్నాయి.
ఆయన.. కారు కనిపిస్తే చాలు... రాళ్లేసి అద్దాలు పగులగొడతాడు.. ధ్వంసం చేస్తాడు. అయితే.. అతను ఇలా చేయడాని కారణం అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడమేనని తెలుస్తోంది. స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.