ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Nagababu: సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు

ABN, Publish Date - Apr 03 , 2025 | 07:07 AM

శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్సీ నాగబాబు సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.

1/9

శాసనమండలి ఛైర్మన్ కార్యాలయంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఎమ్మెల్సీ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకరంగా కలిశారు.

2/9

ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుని చంద్రబాబు నాయుడుని కలిసి శాలువాతో సత్కరించిన అనంతరం బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

3/9

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాగబాబును శాలువాతో సత్కరించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు.

4/9

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు శాసన మండలి సభ్యునిగా బుధవారం శాసన మండలి చైర్మన్ సమక్షంలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

5/9

గత మార్చి నెలలో జరిగిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీకి దిగిన నాగబాబు శాసన మండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

6/9

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచనలకు అనుగుణంగా బుధవారం శాసన మండలిలో నాగబాబు ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు.

7/9

ఎమ్మెల్సీ నాగబాబుకు శుభాకాంక్షలు చెబుతున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, తదితరులు

8/9

శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు పుష్పగుచ్చం అందజేస్తున్న ఎమ్మెల్సీ నాగబాబు

9/9

ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడుతున్న నాగబాబు

Updated Date - Apr 03 , 2025 | 07:09 AM