Home » JANASENA
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీగా ఉన్నారు. ప్రాంతాలవారీగా పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏప్రిల్ 7వ తేదీన పెందుర్తిలో వారాహి వాహనంలో ప్రచారం చేస్తారు. పవన్ కల్యాణ్ పర్యటన వివరాలను పెందుర్తి సుజాతనగర్ జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత పంచకర్ల రమేష్ బాబు తెలియజేశారు.
ఒక యాంకర్.. రెండు పార్టీల తరపున ప్రచారం.. అదేమిటి రెండు పార్టీలు కూటమి కట్టాయనుకుంటున్నారా.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే.. ఆ రెండు పార్టీలు ప్రత్యర్థి పార్టీలు.. ఒకరంటే మరొకరికి అసలు పడదు. అలాంటిది ఒక మనిషి రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం ఏమిటనుకుంటు న్నారా.. మీరు చదువుతున్నది నిజమే..
టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర సుదీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పొత్తు పెట్టుకున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనసేన నేతలు, కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురం.. ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హట్ టాపిక్.. రాజకీయమంతా పిఠాపురం చుట్టూ తిరుగుతోంది. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటమే. నియోజక వర్గంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు పిఠాపురం నియోజక వర్గంలో 14 మంది ఎమ్మెల్యేలుగా పని చేశారు.
జనసేన బలోపేతం కోసం తన స్వార్జితం నుంచి రూ.10 కోట్లను ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విరాళంగా ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన నేత నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారికి పవన్ కళ్యాణ్ చెక్కులు అందజేశారు.
అవినీతి, అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెం దింపేందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ (BJP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి ఫురందేశ్వరి తెలిపారు. విజయవాడలో బీజేపీ పదాదికారుల సమావేశం జరిగింది.
జనసేన ఎన్నికల ప్రచారంలో సమరశంఖం పూరించడానికి సిద్ధమయింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చేపట్టాలని జనసేన కీలక నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సూచించారు. సోమవారం నాడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులతో పవన్ సమావేశం అయ్యారు.
Andhrapradesh: పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ పోతిన మహేష్ సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ‘‘కూటమి లో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసాం నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఆణువణువూ నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చిన వైసీపీతో పోటీ పడలేరు’’ అని అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ఈ సీటును టీడీపీ నుంచి వర్శ ఆశించారు. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లింది. దీంతో వర్మ కొంత అసంతృప్తికి లోనయ్యారు
వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓడిపోతామనే అంచనాకు వచ్చారా..? సిట్టింగ్లను మార్చినా.. ఓటు పడదని గ్రహించారా..? ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు కుట్రలకు తెరలేపారా..? అధికారం కోల్పోతే ఏం జరుగుతుందో ముందే ఊహించారా..? అంటే తాజా పరిణామాలు, జగన్ చేస్తున్న రాజకీయాలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది.