Home » JANASENA
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్రెడ్డి అన్నారు. ఆయన మాడియాతో మాట్లాడుతూ... పేర్నినాని లాంటి వాళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెడతారని ఆయన అన్నారు.
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆపార్టీ నేతలు తెలిపారు. ఈమేరకు ఆపార్టీ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం ఈ విషయాన్ని ప్రకటించారు. పార్టీని హైదరాబాద్ లో బలోపేతం చేయడమేగాక త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు కాంక్షించే ప్రతి ఒక్కరికీ వారి వంతు సేవలు మాతృభూమికి అందించే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.
శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్చార్జి వినుత కోట ఓ వీడియో విడుదల చేశారు. తన మనసు నిండా పుట్టేడు బాధతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాకినాడలోని కలెక్టరేట్ లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడిన పవన్ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఉప్పాడ(Uppada) మత్స్యకారుల సమస్యలపై చర్చించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
జనసేన నేత దినేష్ జైన్, హరి శంకర్, గనితోపాటు పాటు వైసీపీ నేత పసుపులేటి సురేష్పై కిరణ్ రాయల్ కేసు బాధితురాలు పలు ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వారిపై పిర్యాదు చేసింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనాదిగా అభివృద్ధికి నోచుకోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని జిల్లా చేయాలని మంగళవారం డిప్యూటీ తహసీల్దారు షాజియాకు జనసేన పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.