Home » JANASENA
ఏపీ గ్రీనింగ్, రీఫారెస్టేషన్ కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జనసేన నేత బోనబోయిన శ్రీనివాస యాదవ్ హత్యకు వైసీపీ నేత నరేంద్రరెడ్డి కుట్ర చేసినట్లు తెలుస్తోంది. ఓ రౌడీషీటర్తో రూ.కోటిన్నరకు వైసీపీ నేత సుపారీ మాట్లాడినట్లు సమాచారం.
జనసేన పార్టీ కార్యకర్తలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలో జరిగిన జనసేన న్యాయవాదుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జనసేన పార్టీ బలోపేతం కోసం ఎంతోమంది పని చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాధారణ ఎన్నికలలో రాష్ట్ర హితం కోసం కూటమి ధర్మానికి కట్టుబడి అందరూ కలిసి పని చేశారని చెప్పారు.
విజయవాడలో జనసేన పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
గాదె సాయికృష్ణ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా.. ఏ కులం వారు చేసినా.. తప్పే కదా అని నిలదీశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
కువైట్లోని తెలుగుదేశం, జనసేన నాయకులు కూటమి ప్రభుత్వం సుపరిపాలన రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భాన విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
జనసేన పార్టీ పెట్టిందే తెలంగాణలో అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో తమ పార్టీకి లీడర్స్ ఉన్నారు.. కేడర్ ఉందని పేర్కొన్నారు.
తమ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ పేరును జనసేన అధికారికంగా ప్రకటించింది. లింగమనేని పేరును ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేసినట్లు వెల్లడించింది.