Central Goverment: పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. కారణం ఇదే..
ABN, Publish Date - Aug 08 , 2025 | 09:40 PM
గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.
ఢిల్లీ: భారతీయులగా పుట్టిన వారు ఇప్పుడు భారతీయులు కాకుండా పోతున్నారు. యువకులు ఉన్నత చదువులు.. కోసం విదేశాలకు వెళ్లీ.. అక్కడి అలవాట్లకు.. టెక్నాలజీకి అలవాటుపడి అమ్మలాంటి దేశాన్ని వదిలేస్తున్నారు. డాలర్లలో సంపాదిస్తూ... అటూ కన్నవారికి.. ఇటూ దేశాన్నికి దూరం అవుతున్నారు. తాజాగా.. 2024లో రెండు లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ప్రభుత్వం తెలియజేసింది.
గత ఐదు సంవత్సరాలలో ఎంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకుని ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారనే దానిపై వచ్చిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ కెసి వేణుగోపాల్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2020లో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది, 2024లో 2,06,378 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని సింగ్ అన్నారు. భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి లేదా విదేశీ పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలు వ్యక్తిగతమైనవి, ఆ వ్యక్తికి మాత్రమే తెలుసని ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.
మెరుగైన ఆర్థిక వ్యవస్థ యుగంలో ప్రపంచ కార్యాలయ సామర్థ్యాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ఇది భారతీయ డయాస్పోరాతో దాని సంబంధాలలో పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చింది అని మంత్రి పేర్కొన్నారు. జ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా సహా డయాస్పోరా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
Also Read:
ఇంట్లో వరమహాలక్ష్మిని ఈ సాధారణ పద్ధతిలో పూజించండి
28 ఏళ్ల క్రితం కనిపించుకుండా పోయి.. మంచులో మమ్మీగా..
Updated Date - Aug 08 , 2025 | 09:40 PM