Home » NRI Latest News
తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్, వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ సైనికులు, వారి పిల్లలకు బొమ్మలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి.
గల్ఫ్లో తెలుగు ప్రవాసీయులు వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. భారతీయులలో కేరళ వారితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన క్రైస్తవులు చెప్పుకోదగ్గ సంఖ్యలో పని చేసే వారిలో ఉండడంతో క్రిస్మస్ పండుగకు ప్రత్యేకత ఉంది.
పాత భవనాల్లో ఉండే 'ఆస్బెస్టాస్' వల్ల కార్మికులకు కలిగే ఆరోగ్య ప్రమాదాలను ఈ బృందం గుర్తించింది. దానికి పరిష్కారంగా ఒక అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థను ప్రతిపాదించింది. నిపుణుల సలహాలు తీసుకుంటూ.. క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి వీరు రూపొందించిన ఈ 'ఇన్నోవేషన్ ప్రాజెక్ట్' అందరి ప్రశంసలు అందుకుంది.
తెలంగాణ విమానయాన తయారీ రంగంలో వృత్తి నైపుణ్యత పెంచేందుకు తనవంతు కృషి చేస్తానని అమెరికాలోని బోయింగ్ విమాన తయారీ సంస్థ శాస్త్రవేత్త, పరిశోధన విభాగ అధిపతి ప్రో. మామిడాల రాములు అన్నారు.
తానా కళాశాల 2025–26 విద్యాసంవత్సరానికి భారతీయ నృత్య–సంగీత డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్ వెలువరించింది. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం , వీణ వంటి శాస్త్రీయ కళలలో అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
సెయింట్ లూయిస్లో నివసించే ప్రవాస ఆంధ్రుల కోసం ఉచిత ఆహార సేకరణ చేపట్టింది తానా సౌత్ సెంట్రల్ విభాగం. అందులో భాగంగా సుమారు 200 కుటుంబాలకు సరిపోయే ఆహారాన్ని సేకరించి ఫుడ్ బ్యాంక్కు విరాళమందించింది.
జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సహకారంతో, సంస్థ బోర్డు ఆఫ్ ట్రస్టీ విష్ణు ప్రకాష్ రావు మాధవరం సొంత నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
దివ్యాంగులైన భారతీయ చిన్నారులకు ఔట్రీచ్ ఖతర్ సంస్థ అండగా నిలుస్తోంది. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్లో కూడా సంతోషం వెల్లివిరిసేలా చేస్తోంది.
ఖతర్ నుంచి వచ్చిన ఎన్నారై పంచిత ధర్మరాజు యాదవ్ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ప్రజలు విజ్ఞులని, అభివృద్ధి ఎజెండాను అర్థమయ్యే రీతిలో వివరిస్తే గెలిపిస్తారని ఆయన అన్నారు.
ఖతర్లోని తెలుగు ఇంజనీర్ల ఫోరం ఆవకాశాలు, అనుభవాలు, అభ్యర్థులకు మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఒక వారధిగా వ్యవహరిస్తోంది. యం.ఇ.పి, యు.డి.పి.ఎ గుర్తింపునకు సంబంధించి చట్టపరమైన సమస్యను పరిష్కరించడంలో తెలుగు ఇంజనీర్ల ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది.