Home » Lok Sabha
తెలంగాణతో పాటు దేశంలో చాలా రాష్ట్రాల్లో కోతుల సమస్యలపై బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్లమెంట్ లో ప్రస్తావించారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. వానరాల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
సంచర్ సాథీ యాప్తో వ్యక్తిగత జీవాతాలపై నిఘా పెడుతున్నారంటూ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి స్పందిస్తూ, వినియోగదారులు అక్కర్లేదనుకుంటే యాప్ను డిలీట్ చేయవచ్చని, యాక్టివేట్ చేసుకోకుంటే సరిపోతుందని అన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది..
నిబంధనలు ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల జైలు కానీ రూ.కోటి జరిమానా కానీ, రెండూకానీ విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ గేమ్స్కు సంబంధించి అడ్వర్టయిజ్మెంట్లలో భాగం పంచుకుంటే గరిష్టంగా రెండేళ్ల జైలు, రూ.50 లక్షల జరిమానా విధిస్తారు.
ఐదు సంవత్సరాలు, అంతకు మించి శిక్షపడే అవకాశమున్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్టయి 30 రోజులు జైల్లో ఉండే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో...
లోక్సభలో ఇవాళ ప్రతిపక్ష ఎంపీలు గందరగోళం సృష్టించారు. ఒక దశలో నిరసనలు, నినాదాలు మిన్నంటడంతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నినాదాలు చేస్తున్న ఎనర్జీతో ప్రశ్నలడిగితే దేశ ప్రజలకు..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్ టన్నులు యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మాత్రమే కేంద్రం సరఫరా చేసిందని చెప్పారు. ఆగస్టు 13వ తేదీ వరకు ఇంకా 6.60లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల పేర్కొన్నారు.
మన దేశంలో చిన్న విషయాలకు జైలు శిక్ష విధించే చట్టాలు ఉన్నా.. వాటిని ఎవరూ ఎప్పుడూ పట్టించుకోలేదని పియూష్ గోయల్ తెలిపారు. భారతీయులను జైలులో పెట్టే అటువంటి అనవసరమైన చట్టాలను రద్దు చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇంట్లో నోట్ల కట్టలు లభించిన వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ స్వీకరించారు. ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఢిల్లీ: లోక్సభ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో ప్రవేశపెట్టిన రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు.