Home » Lok Sabha
ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా లోక్సభకు వివరించారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.
లోక్సభలో మూడు బిల్లులపై కీలకమైన ఓటింగ్ జరుగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ మరి కాసేపట్లో ఉందనగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'మెజిషియన్'గా రాహుల్ గాంధీ సంబోధించారు. దీనిపై లోక్సభలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
లోక్సభలో జరుగుతున్న చర్చపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది మహిళా బిల్లు కాదని, 2023లోనే బిల్లును పార్లమెంటులో ఆమోదించారని అన్నారు. ఎన్నికల మ్యాప్ను మార్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు.
లోక్ సభలో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ బిల్లులపై మరికొద్ది సేపట్లో లోక్ సభలో ఓటింగ్ జరగనుంది.
డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది.
లోక్సభలో మహిళల రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ప్రచారం తప్పని, డీలిమిటేషన్ వల్ల ఆ రాష్ట్రాలకు తగిన రీతిలో సీట్లు పెరుగుతాయని వివరించారు.
కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డీఎంకే పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గుతుందంటూ డీఎంకే చేస్తున్న వాదనలను ఆయన 'మొసలి కన్నీళ్లు'గా అభివర్ణించారు.