Home » Lok Sabha
తృణమూల్ కాంగ్రెస్లో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో రగులుతున్న తిరుగుబాటు ఎంపీలు తమదే 'నిజమైన టీఎంసీ' పార్లమెంటరీ గ్రూప్ అని క్లెయిమ్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
లోక్సభలో కొత్త చీఫ్ విప్గా పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నియమాకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ చైర్మన్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్సభ స్పీకర్కు అధికారికంగా లేఖ రాశారు.
టీఎంసీలో తలెత్తిన తిరుగుబాటు పార్లమెంటుకు పాకింది. పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. దీనికి కొనసాగింపుగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
తృణమూల్ కాంగ్రెస్కు లోక్సభలోనూ అసమ్మతి పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండటంపై ఆ పార్టీ సుప్రీం మమతా బెనర్జీ పార్లమెంటు దిగువసభకు పోటీ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో టీఎంసీ ఓటమి పాలై అధికారం కోల్పోయింది.
లోక్సభ, శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50 శాతం పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల రెండో వారంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని..
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో నియోజక వర్గాల పునర్విభజన ఇక ఇప్పట్లో ఉండకపోవచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఓటింగ్లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు.
డీలిమిటేషన్ ప్రధాన ఉద్దేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా లోక్సభకు వివరించారు. ప్రస్తుత లోక్సభ నియోజకవర్గాల జనాభాలో భారీ వ్యత్యాసం ఉందని చెప్పారు. ఆ కారణంగా ఒక్కో ఎంపీ లక్షలాది మంది ఓటర్ల సమస్యలను వినడటం కష్టంగా మారిందన్నారు.
లోక్సభలో మూడు బిల్లులపై కీలకమైన ఓటింగ్ జరుగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఓటింగ్ మరి కాసేపట్లో ఉందనగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 'మెజిషియన్'గా రాహుల్ గాంధీ సంబోధించారు. దీనిపై లోక్సభలో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.