Home » Amit Shah
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, అధికారులతో రాయ్పూర్లో అదివారంనాడు సమీక్షా సమావేశం జరిపినట్టు అమిత్షా తెలిపారు. సెక్యూరిటీ టీమ్లను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్వర్క్ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీలు వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్టు చెప్పారు.
బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అవినీతి పరులను ఒకరి తరువాత మరొకరిని జైలుకు పంపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు.
రాహుల్ గాంధీ ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చని, అయితే బీజేపీ అధికారంలో ఉన్నంత వరకూ ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అగౌరవ పరిచేందుకు అనుమతించమని అమిత్షా అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర ప్రభుత్వంతో కీలక చర్చలు జరిపారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అలాగే ఉప్పాడ సముద్ర రక్షణ గోడ వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ ఆధ్యక్ష పదవికి నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ప్రకటించింది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఈ పదవి అందుకోవడం ద్వారా పార్టీ చరిత్రలో అతి పిన్న అధ్యక్షుడిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్షా తొలిసారి పర్యటించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం) సాయంత్రం 3:30 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరతారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాత్రి డిన్నర్ మీటింగ్ చేస్తారు. తిరిగి 11:00 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడకు వస్తారు.
ప్రజాసంక్షేమం కంటే వారసత్వ రాజకీయాలకే డీఎంకే ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాధాన్యతనిస్తున్నాయని అమిత్షా విమర్శించారు.
ఎన్నికల సన్నాహకాలను సమీక్షించేందుకు మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రిని టీఎంసీ బాస్ బెదిరించారని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర తప్పుపట్టారు. తాము తలుచుకుని ఉంటే మమతా బెనర్జీని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన చోటు నుంచి బయటకు అడుగు పెట్టకుండా చేసేవాళ్లమని అన్నారు.
పధ్నాలుగేళ్ల క్రితం ప్రజలు భయంగుప్పిట్లో ఉన్నప్పుడు తాము బంకురలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, నీటిసంక్షోభాన్ని అధిగమించేందుకు ఎంతో చేశామని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీని తప్పుపట్టారు.