Home » Amit Shah
Telangana: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కమలం పార్టీ స్పీడప్ చేసింది. తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. అందుకు తగిన ప్రణాళికలను రూపొందించింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతల పర్యటనలు నిర్వహించేలా ప్లాన్ సిద్ధం చేసింది. అందులో భాగంగా తెలంగాణలో బీజేపీ జాతీయ నేతలు వరుసగా పర్యటించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వంశపారంపర్య పన్ను వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. బుధవారం కేరళలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తొసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నట్లు ఆ ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరసగా పర్యటించనున్నారు. ఈ క్రమంలో గురువారం కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారు. రేపు మధ్యహాన్నం 12 గంటలకు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
'జై-వీరు' పేర్లు చెప్పగానే 1975లో విడుదలైన 'షోలే' చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర పాత్రలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ధర్మేంద్ర సరసన కథానాయకిగా నటించిన హేమమాలిని తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలను భారత రాజకీయాల్లో 'జై-వీరు'లతో పోల్చారు. విపక్షాలను 'గబ్బర్'గా అభివర్ణించారు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ‘ఆస్కార్ అవార్డ్’ వచ్చిన తర్వాత రామ్ చరణ్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సన్మానించిన విషయం అందరికీ తెలిసిందే. చరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో..
కాంగ్రెస్ పార్టీ వెనకబడిన తరగతులకు వ్యతిరేకమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఆరోపించారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను విపక్షాలు తొలగించాలని కోరుతున్నప్పటికీ.. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లో వాటిని తొలగించదన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తే.. నిషేధిత సంస్థలు పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థలు పునరజ్జీవనం పొందుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని.. దీంతో పీఎప్ఐ సంస్థకు రాజస్థాన్లోని కోట కేంద్రంగా మారిందని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్కు రానున్నారు.
లోక్ సభ ఎన్నికలు - 2024కు ( Lok Sabha Elections - 2024 ) కేంద్ర హోంమంత్రి అమిత్ షా గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో తనకు ఎంత ఆస్తి ఉందో వెల్లడించారు.
ఓకే దేశం ఓకే ఎన్నిక అంశంపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. వన్ నేషన్- వన్ ఎలక్షన్ అనేది కొత్తది ఏం కాదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఓకే దేశం ఓకే ఎన్నిక కొనసాగిందని గుర్తుచేశారు. 1971లో ఇందిరాగాంధీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లడంతో సమస్య వచ్చిందని పేర్కొన్నారు.