ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీటీడీపై బీజేపీ ఎంపీ ఫైర్

ABN, First Publish Date - 2025-03-14T15:54:06+05:30

Telangana BJP MP TTD issue: టీటీడీ అవలంభిస్తున్న వైఖరి పట్ల తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.

తిరుమల, మార్చి 14: టీటీడీపై తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిభ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ..ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని అడిగారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినా, పాలకమండలి నిర్ణయం తీసుకున్నా అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని మండిపడ్డారు.


తెలంగాణ ప్రజాప్రతినిధులు పట్ల టీటీడీ వివక్ష తగదన్నారు. పాలకమండలి అత్యవసరంగా సమావేశమై నిర్ణయం అమలు చేయాలని కోరారు. వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు ఇస్తామని.... వాటిని పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరు తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని అన్నారు. వెంటనే సిఫార్సు లేఖలపై పాలకమండలి నిర్ణయం తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

Holi celebration controversy: హోలీ సంబరాల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరిగిందంటే

Farmhouse case investigation: విచారణకు హాజరైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ..

Read Latest Telangana News And Telugu News

Updated Date - 2025-03-14T15:56:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising