Home » Andhrapradesh
కుమారులు వివాహం చేసుకోవడం లేదని.. మనస్థాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన భీమవరం పట్టణంలో జరిగింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన ఉన్మాదంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఫొటో పట్టుకుని రప్పా రప్పా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భీభత్స చేశారు. అలాగే మరికొంతమంది రక్తతర్పణం అంటూ అలజడులు రేకెత్తించారు. అయితే.. దీనిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...
పంట సాగులో నష్టపోయిన మహిళలు... పాల ఉత్పత్తిలో చేతులు కలిపారు. లక్షల లీటర్లలో పాలసేకరణ చేస్తున్న మహిళా పాడి సహకార సంఘం నేడు దేశానికే స్ఫూర్తినిస్తోంది. 1.2 లక్షల సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా సంస్థగా గుర్తింపు పొందింది. ఆ విశేషాలే ఇవి...
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.