Home » Andhrapradesh
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలో తరిస్తున్న మరికొందరు ఉన్నతాధికారులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ పదవుల నుంచి పక్కకు తప్పించడం ఖాయమని
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందంటే... ఈసీ చెప్పినట్లు వినాల్సిందే. ఈసీ ఆదేశాలు పాటించాల్సిందే. కేంద్రం సూచనలు, ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. కానీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరే వేరు! ఆయన ఇప్పటికీ జగన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు. గీత దాటి మరీ జగన్
Andhrapradesh: గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 17వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫలితాలను గత రాత్రి విడుదల చేశారు. అయితే రాత్రి పూట ఫలితాల విడుదలపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి అభ్యంతరం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అర్థరాత్రి గ్రూప్స్1 పరీక్షల ఫలితాలు విడుదల చేయడం వెనుక ఆంత్యర్యం ఏంటి అని ప్రశ్నించారు. అలాగే ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గడంపై కూడా టీడీపీ నేతల విరుచుకుపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ( Nara Lokesh ) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్టీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఒంగోలులో టీడీపీ నేతలపై దాడి అంశాలపై అదనపు సీఈఓ కు ఫిర్యాదు చేశారు.
విలువ లేని పార్టీలో ఇమడలేకే కాంగ్రెస్ ( Congress ) పార్టీలోకి చేరినట్లు పూతలపట్లు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు అన్నారు. రాజకీయ భవిష్యత్ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ చేరడం ఆనందంగా ఉందన్నారు. ఎ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను వెల్ల డించింది. 1:100 నిష్పత్తిలో రిజల్ట్స్ రిలీజ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.
వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) సతీమణి నారా భువనేశ్వరి మండిపడ్డారు. అక్రమ దారిలో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగంలో పలు అబద్ధాలు చోటుచేసుకున్నాయి. పెన్షన్లు తీసుకునేందుకు వెళ్లి 31మంది వృద్ధులు చనిపోయారని, వారి మరణానికి చంద్రబాబే కారణమని నాయుడుపేట బహిరంగసభలో జగన్ ఆరోపించారు.