Home » Andhrapradesh
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో.. అనంతపురం జిల్లాలని గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. కాకినాడ టౌన్-మైసూరు మధ్య (వయా గుంతకల్లు) ఓ బైవీక్లీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన ఉన్మాదంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఫొటో పట్టుకుని రప్పా రప్పా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భీభత్స చేశారు. అలాగే మరికొంతమంది రక్తతర్పణం అంటూ అలజడులు రేకెత్తించారు. అయితే.. దీనిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...
పంట సాగులో నష్టపోయిన మహిళలు... పాల ఉత్పత్తిలో చేతులు కలిపారు. లక్షల లీటర్లలో పాలసేకరణ చేస్తున్న మహిళా పాడి సహకార సంఘం నేడు దేశానికే స్ఫూర్తినిస్తోంది. 1.2 లక్షల సభ్యులతో ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా సంస్థగా గుర్తింపు పొందింది. ఆ విశేషాలే ఇవి...
సంక్రాంతి పండుగను పురష్కరించుకుని జనవరి నాలుగో తేదీ నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. జనవరి 4వతేదీ నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతుప్పారు. సికింద్రాబాద్-అనకాపల్లితోపాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సోమందేపల్లి మండలంలో గంజాయి గ్యాంగ్ అరాచకాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువలా వస్తున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు ఉదాసీన వైఖరిని అవలంభిస్తున్నారని, దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని పలువురు పేర్కొంటున్నారు.
కాలం చెల్లిన పౌష్టికారాన్ని గర్భిణులు, బా లింతలు, చిన్నారులకు ఎలా పంపిణీ చేస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యురాలు గంజిమాల దేవి ఐసీడీఎస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ నగర్ పాఠశాలలో ఉన్న అంగనవాడీ కేం ద్రాన్ని ఆమె బుధవారం తనిఖీ చేశారు. అంగనవాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే పౌష్టిక ఆహారంపై తేదీ, నెల, సంవత్సరం పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని అంగనవాడీ టీచర్లకు సూచించా రు.
తిరుపతిలో ఫుడ్ కోర్ట్కు ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది. మొత్తం ఈ ఫుడ్ కోర్ట్లో 40 నుంచి 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని వీలైనంత తొందరగా నిర్మింపజేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పట్లు చేస్తున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తలు తిరుపతికి విచ్చేస్తుంటారు.