Home » Raghunandan Rao
మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ’కాంగ్రెసోళ్ల దగ్గర మస్తు సిలకున్నయి(నగదు నిల్వలు), వాళ్లు ఇస్తే వద్దనకుండా తీసుకోండ్రి.. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నదంతా ఈ ఎన్నికల్లో పంచిపెట్టుమనుండ్రి’ అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాక్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పార్లమెంట్ సభ్యుడు ఘునందన్రావు అన్నారు. ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ త్వరలో పూర్తవ్వాలని, దోషులను జైలుకు పంపాలని కోరారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కర్త, కర్మ అన్ని ఒకరి వైపే వేలు చూపిస్తున్నాయని.. కానీ ఆయనను పిలిచేందుకు భయపడుతున్నారంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తతంగమంతా ఎన్నికల కోసం పిలుస్తున్నట్లుగా ఉందని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో సర్పంచులు పనిచేసిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసే ప్రతి పథకాన్ని ఇక్కడ కూడా అమలు చేసేలా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘునందన్ రావు సూచించారు.
బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్ను బయటకు తెచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటికి వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదని విమర్శించారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.
పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని...పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.