Home » Raghunandan Rao
Telangana: గెలుపే లక్ష్యంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీకి ఓటు వేయాల్సింది ప్రజలను కోరుతున్నారు. సోమవారం దుబ్బాకలో రఘునందన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆయనకు మెదక్ జిల్లాకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మాజీ సీఎం కాళ్లు మొక్కి వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని విమర్శించారు.
Telangana: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 1985లో కేసీఆర్ మొదటిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 39 ఏండ్లుగా సిద్దిపేటలో కుటుంబ పాలన సాగుతోందని విమర్శించారు. శుక్రవారం నంగునూర్ మండలం కోనాయి పల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ప్రచారంలో పాల్గొన్నారు.
అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట రామిరెడ్డి (Venkatarami Reddy) అన్నారు. ఆదివారం నాడు వర్గల్ మండలం గౌరారంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ (BRS) కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకటరామిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి , మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) పూర్తిగా మునిగిపోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్లో బీజేపీ మెదక్ పార్లమెంటు నియోజక వర్గం బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) గర్వం వల్లనే నేడు ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని.. ఆ పార్టీలో ఇక ఎవరు ఉండరని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు (Raghunandan Rao) అన్నారు.
Telangana: పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం జిల్లాలోని మర్కుక్ మండల కేంద్రంలో రంగనాయక స్వామి ఆలయంలో రఘునందన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, హరీష్రావులకు తెలంగాణలో మెదక్ పార్లమెంటు అభ్యర్థికి పోటీ చేయడానికి ఒక్కరు కూడా దొరకలేదా అని ప్రశ్నించారు.
సొంత అవసరాల కోసం కొంతమంది నేతలు పార్టీలు మారుతున్నారని బీజేపీ సీనియర్ నేత రఘునందనరావు (Raghunandan Rao) అన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకుకు టికెట్ ఇస్తే బీజేపీలో ఉండేవారని...టికెట్ ఇవ్వకపోతే పార్టీ మంచిది కాదా అని ప్రశ్నించారు.
కమలం పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్కు తెరదీసింది. పెండింగ్ పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కసరత్తు నిర్వహిస్తోంది. 17కు గాను.. 9పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. బలహీనంగా ఉన్న చోట చేరికలను కమలం పార్టీ ప్రోత్సహిస్తోంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొసాగిస్తోంది.