Home » Raghunandan Rao
ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు పేల్చాలని ఓ వర్గం వాళ్లు కుట్ర పన్నారని ఆరోపించారు.
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కమలం జెండా ఎగిరితీరుతుందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే అది మూసీ నదిలో వేసినట్లేనని ఆయన అభివర్ణించారు.
పేదోడి ఇండ్లను అడ్డగోలుగా కూలగొడుతున్నారని...పెద్దలకు ఎలా అనుమతులు ఇస్తారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కి చిత్త శుద్ధి ఉంటే ఈ నిర్మాణాన్ని ఆపాలన్నారు. నిర్మాణం ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
దసరా సెలవుల్లో కూడా ఉద్యోగులతో రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేయిస్తోందని.. ఈ ఆలోచనను విరమించుకోవాలని బీజేపీ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కోరారు. ఉద్యోగులను దసరా సెలవుల్లో కూడా పని చేయించడం సరికాదని చెప్పుకొచ్చారు.
జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు మండిపడ్డారు. గతంలో కాఫీ మీద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని రఘునందన్రావు గుర్తుచేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్కు కేంద్రమంత్రి కిషన్రెడ్డి అభినందనలు తెలిపారు. సాధారణ కార్యకర్తగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో, అకుంఠిత దీక్షతో నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి ఇవాళ ఉపరాష్ట్రపతిగా విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ జీవితం స్ఫూర్తిదాయకని కిషన్రెడ్డి కొనియాడారు.
కేసీఆర్ కుటుంబ, అవినీతి పంచాయితీల్లోకి తాము వెళ్లబోమని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావు చెప్పారు. మోకిలా ప్రాజెక్టు తప్ప కవిత కొత్తగా చెప్పిన విషయం ఏమీ లేదని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. టీబీజేపీ చీఫ్గా రాంచందర్రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్రావు.
మెదక్ జిల్లా రామాయంపేటలోని వరద బాధిత ప్రాంతాల్లో ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. సిద్దిపేట - రామాయంపేట 765 డీజీ జాతీయ రహదారిపై నందిగామ వద్ద కల్వర్టు కుంగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు.
తప్పుడు వార్తలు రాయవద్దని, ఎవరి చేతుల్లో బలిపశువు కావద్దని మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు జర్నలిస్టులకు సూచించారు. ఏదైనా అంశంపై కథనం రాసే ముందు సంబంధిత వ్యక్తుల వివరణ తీసుకోవాలని, వారు మాట్లాడడానికి స్పందించకపోతే స్పందించడం లేదని రాయాలని ఆయన సూచించారు.