Home » Raghunandan Rao
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతిని మించి కాంగ్రెస్ దోచుకోవాలని చూస్తోందని విమర్శించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ నిషేధానికి ప్రతి జూన్ 23వ తేదీన ఒలింపిక్ డేను నిర్వహిస్తున్నామని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నశాముక్త భారత్ కింద మళ్లీ ఈ ర్యాలీ చేపడుతున్నామని పేర్కొన్నారు.
మన జీవితంలో యోగా భాగస్వామ్యం అవ్వాలని ప్రజలకు మెదక్ లోక్సభ సభ్యుడు, ఎంపీ ఎం.రఘునందన్ రావు పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని క్రికెట్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనం చేసి యోగను ఆయన ప్రారంభించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదని మెదక్ ఎంపీ, బీజేపీ నేత ఎం.రఘునందర్ రావు మండిపడ్డారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురించి అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహీరాబాద్లో బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించారని.. కానీ డీపీఆర్లో బుల్లెట్ ట్రైన్ ఎందుకు లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ విషయంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదని నిలదీశారు.
రేపటి నుంచి వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ పేరిట యాత్ర చేపట్టబోతున్నామని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ యాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవడం సిగ్గుచేటు అని ఎంపీ రఘునందన్ రావు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవగాహన లేకపోవడం వల్లే మహిళలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు.