BRS: ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఊరుకోం
ABN, Publish Date - May 18 , 2025 | 04:36 AM
లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ నిర్ణయం
ఉద్యోగ సంఘాల నేతలతో కేటీఆర్, హరీశ్రావు భేటీ
హైదరాబాద్, మే 17(ఆంధ్రజ్యోతి): లక్షల మంది ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పూర్తిస్థాయి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. హరీశ్రావు నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం జరిగింది.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకపోవడం, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ను కూడా సకాలంలో అందించకపోవడం వంటి విషయాలను కేటీఆర్, హరీశ్రావుల దృష్టికి సంఘ నాయకులు తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB
PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 18 , 2025 | 04:36 AM