Home » KTR
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’గా అనుముల కొండల్ రెడ్డిని ప్రకటించాలని ఎద్దేవా చేశారు.
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన టెసరాక్ట్ అడ్వాన్డ్స్ సిస్టమ్స్ కంపెనీకి విలువైన ప్రభుత్వ భూముల కేటాయింపుపై విచారణ చేయాలి.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ కాదని, 89 కేసులున్న రేవంత్ను ముఖ్యమంత్రిగా చేయడమే ‘‘క్రిమినల్ వేస్ట్’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను, యువతను అవమానించే ఆర్హత ముఖ్యమంత్రికి లేదని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మొత్తం రూ.75.88 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది. రేసుకు సంబంధించి 9, 10 సీజన్ల కోసం ఈ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని తెలిపింది.
హైడ్రాపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బంగాళాఖాతంలో మునిగిపోయిన వాళ్లే హైడ్రాను బంగాళాఖాతంలో వేస్తామంటే అర్థం లేదంటూ సెటైర్ విసిరారు.
హైడ్రా బుల్డోజర్ల చర్యలపై బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
పుట్టినరోజు నాడైనా కేటీఆర్ నిజాలు మాట్లాడాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. నల్ల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మరన్నారు.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నవారిని ఒక్కరిని కూడా వదలమని స్పష్టం చేశారు.