Home » KTR
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్సఏ) చెబితేనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, గోదావరి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన 2024-25 బడ్జెట్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇచ్చే పింఛను పెంపు మాటేలేదని, నిరుద్యోగ భృతి రూ.4వేలకు సంబంధించిన అంశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బడ్జెట్పై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో కాంగ్రెస్ నేతలు చూపుతున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీటిని రైతులకు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ప్రశ్నించారు. BRS నాయకులు తమ జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు లేఖ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించేందుకు గురువారం(రేపు) రోజున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనుంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే వారంతా బయలుదేరనున్నారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లనున్నారు.
రేవంత్ రెడ్డి సహనంతో ఉండాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న చర్చపై కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.