PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
ABN , Publish Date - May 09 , 2025 | 11:11 AM
PIB Fact Check: భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు బాగా ఎక్కువయ్యాయి. యుద్ధం నేపథ్యంలో 3 రోజులపాటు ఏటీఎమ్లు బంద్ చేస్తున్నారంటూ వాట్సాప్లో ఓ పోస్టు వైరల్గా మారింది. ఆ పోస్టుపై పీఐబీ స్పందించింది.

భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఏటీఎమ్లు మూసేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సాప్లో ఓ పోస్టు వైరల్ అయింది. ఈ వైరల్ పోస్టుపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఏటీఎమ్లు మూసివేస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తను నమ్మవద్దని, ఇతరులకు షేర్ కూడా చేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేసింది.
కాగా, భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ దాడులనుంచి పౌరులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఛండీఘర్, శ్రీనగర్, అమృత్ సర్, లుధియానా, షిమ్లా, జోద్పూర్, జమ్మూ, పఠాన్కోట్ ఎయిర్పోర్టులను భారత విమానయాన శాఖ మూసేసింది. పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాలు సరిహద్దు ప్రాంతాల్లోని స్కూళ్లను, కాలేజీలను మూసి వేశాయి. పాకిస్తాన్ ఏరియల్ అటాక్స్కు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చండీఘర్లో ఎయిర్ఫోర్స్ స్టేషన్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలు బయట తిరగొద్దని, ఇంట్లోనే ఉండాలని స్థానిక అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: దూకుడు పెంచిన పాక్.. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు
Operation Sindoor: భారత్, పాక్ యుద్ధం.. కిమ్ సపోర్టు ఎవరికి..