Home » Operation Sindoor
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ లాంటి దుస్సాహసానికి మరోసారి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ భారత్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయింది.
ఆపరేషన్ సిందూర్ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
గతేడాది భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని పాక్ నేత షహీర్ సియాల్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నజ్రియాతీ పార్టీ చైర్మన్ అయిన షహీర్ సియాల్వి, తాజాగా లష్కరే తోయిబా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.
గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త గందరగోళానికి తెరతీశాయి.