Home » Operation Sindoor
ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ రక్షణ కోసం అత్యున్నత త్యాగం చేసిన ఆరుగురు సైనికుల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్ఫోర్స్ పాత్ర చాలా కీలకమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
పాకిస్థాన్కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరిక చేశారు. అవసరమైతే ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైనిక బలగాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయని చెప్పారు. భూమి, ఆకాశం, సముద్రంలో అత్యాధునిక రీతుల్లో పోరాటానికి త్రివద దళాలు సామర్థ్యం పెంచుకుంటున్నట్టు తెలిపారు.
సైనిక ఖచ్చితత్వం, సమాచార నియంత్రణకు నిదర్శనంగా.. ఆపరేషన్ సిందూర్ నిలిచిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ లాంటి దుస్సాహసానికి మరోసారి పూనుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ భారత్ను పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ హెచ్చరించారు.
పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.
ఆపరేషన్ సిందూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ఫోర్స్ సోషల్ మీడియా ఖాతాల్లో గురువారం ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వీడియోలు రిలీజ్ చేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్కు ఏడాది పూర్తయింది.
ఆపరేషన్ సిందూర్ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.