Home » Harish Rao
ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.
పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీని అమలుచేయని బీజేపీ, బీఆర్ఎ్సలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ప్రశ్నించే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
రాష్ట్ర వికాసం బీఆర్ఎ్సతోనే సాధ్యమని.. బీజేపీ, కాంగ్రె్సలను గెలిపిస్తే విధ్వంసమేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు
Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
Telangana: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నయా నాటకాలకు తెర లేపుతున్నారని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రఘు నందన్ రావు దుబ్బాకలో ఓడిపోతే కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోలేదా అని అన్నారు. పోలీసులతో డబ్బులు పంచి గెలిచినందుకు కేసీఆర్కు సిగ్గు ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు. వెంకట్ రాంరెడ్డి ఎన్ని కట్టలు కట్టించినందుకు మెదక్ సీటు ఇచ్చావ్ కేసీఆర్ అని నిలదీశారు.
హనుమకొండ : ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆదివారం భీమదేవరపల్లి మండలం, ముల్కనూర్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు.
మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి(Congress Party) పార్లమెంట్ ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) ప్రజలు బుద్ది చెప్పాలని బీఆర్ఎస్(BRS) పార్టీ నాయకులు హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం నాడు సిద్దిపేట జిల్లా(Siddipet) అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో వెంకట్రామిరెడ్డికి(Venkata Ram Reddy) మద్ధతుగా ప్రచారం నిర్వహించారు.
Telangana: ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో మార్పు మొదలైంది. రేవంత్ పాలనలో పంట పెట్టుబడి సహాయం అందలేదు మార్పు మొదలైంది. అనేక పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో కోతతో మార్పు మొదలైంది. పంటలు ఎండటంలో మార్పు. అక్రమ కేసులు పెట్టడంలో, జైళ్లు నింపడంలో మార్పు మొదలైంది’’ అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.