ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వం మహిళల కంట కన్నీరు పెట్టిస్తోంది..బండి సంజయ్ ఫైర్

ABN, Publish Date - Mar 08 , 2025 | 10:54 AM

Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.

Bandi Sanjay

హైదరాబాద్: మహిళా సాధికారతను చేతల్లో చూపుతున్న మహనీయుడు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. మహిళలు శక్తి స్వరూపాలని అభివర్ణించారు. స్త్రీలను అత్యంత గౌరవిస్తూ అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు. రాష్ట్రపతి, ఆర్ధిక మంత్రిగా మహిళలకు బాధ్యతలు అప్పగించిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు. ‘మహిళా శక్తి’ అంటే పెద్దపెద్ద ప్రకటనలు, ప్రసంగాలకే పరిమితమవడమా అని ప్రశ్నించారు. మహిళలకు ప్రతినెలా రూ.2500లు హామీ ఏమైందని రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తులం బంగారం, స్కూటీ హామీలు ఎటు పోయాయని బండి సంజయ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.


బెల్టు షాపుల నిర్మూలన వాగ్దానం ఏమైందన్నారు. తెలంగాణ మహిళలు రాణిరుద్రమదేవి వారసులు అని బండి సంజయ్ కుమార్ కొనియాడారు. మహిళలను మభ్యపెట్టే పాలకులకు కర్రు కాల్చివాత పెట్టడం తథ్యమని హెచ్చరించారు. మహిళలు అంటే అమ్మవారి శక్తి స్వరూపాలు... సృష్టికి మూల కారకులు అని ప్రశంసలు కురిపించారు. కుటుంబాన్ని, సమాజాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో ఏమీ ఆశించకుండా పిల్లల ఎదుగుదలకు జీవితాన్నే త్యాగం చేసేది తల్లి మాత్రమే అని చెప్పారు. అక్కా చెల్లెళ్ల రూపంలో, భార్యగా తోడునీడగా నిలిచేది స్త్రీ మూర్తులే అని చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు.


బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు చేయూత..

‘మహిళా దినోత్సవం నాడు మాత్రమే మహిళలను పొగిడి... ఆ తర్వాత వారిని విస్మరించే పార్టీ బీజేపీ కానే కాదు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ. ఏ మహిళల చేతిలో డబ్బు ఉందో ఆ కుటుంబం, ఆ దేశం సురక్షితంగా, ప్రగతి పథంలో నడుస్తుందని నమ్మి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆచరిస్తున్నారు. మహిళకు ఆర్ధిక మంత్రి పగ్గాలు అప్పగించడంతో పాటు కేంద్ర కేబినెట్‌లో, ప్రభుత్వ పదవుల్లో సముచిత భాగస్వామ్యం కల్పించారు. దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్లను కట్టించి మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇంటి తాళాలు అప్పగించడంతోపాటు మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మించి మహిళలకు మోదీ అందజేయడానికి సిద్ధమయ్యారు. మహిళల పేరుతో ఎనిమిది కోట్ల కుటుంబాలకు నల్లా కనెక్షన్లు, ఇరవై ఐదు కోట్ల మంది స్త్రీలకు జన్ ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు ఇరవై ఐదు కోట్ల మంది మహిళలకు 10 లక్షల కోట్ల రూపాయలను ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి నా అక్కా చెల్లెళ్లు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా చేస్తూ మహిళా శక్తికి అసలైన నిర్వచనం చెబుతూ మహిళా సాధికారత అంటే ఏమిటో చేతల్లో చూపుతున్న మహనీయుడు మోదీ’ అని బండి సంజయ్ కుమార్ ప్రశంసలు కురిపించారు.


మహిళలు ఆర్ధికంగా రాణించాలి..

‘దేశంలోని 11 కోట్ల మందికి ఉజ్వల కనెక్షన్లు అందించి కట్టెల పొయ్యి బాధ లేకుండా చేసి మోదీ మహిళల కంట కన్నీరు తుడిచారు. భేటీ బచావో.. భేటీ పడావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన వంటి పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ‘మహిళా శక్తి’ అంటే మహిళా దినోత్సవం నాడే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పత్రికల్లో, టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలిస్తూ ప్రచారం చేసుకోవడం కాదు. ఆచరణలో చూపాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2500లు ఇస్తామన్నారు. 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదు. బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదు. తెలంగాణలో మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్ధికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం నాడు మాత్రమే ‘మహిళలను శక్తి’గా మారుస్తామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే నమ్మేదెవరు. రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న నా తెలంగాణ మహిళలు చైతన్యవంతులు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్రు కాల్చివాత పెట్టడం తథ్యం’’ అని బండి సంజయ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gudem Mahipal Reddy: నేను కాంగ్రెసోణ్ని కాదు!

Gachibowli: ఎకరా టార్గెట్‌ 100 కోట్లు!

Hyderabad: హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Read Latest Telangana News and Telugu News

Updated Date - Mar 08 , 2025 | 11:04 AM