Home » Congress 6 Gurantees
విచారణ అర్హతలేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నల్లమలసాగర్ విషయంలో బలహీనమైన రిట్ పిటిషన్ వేసి పరోక్షంగా ఏపీకి మద్దతిస్తున్నారని సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన మండిపడ్డారు.
తెలంగాణలో రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఎన్నికలపై సీరియస్గా దృష్టి సారించిన పార్టీ, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగాా బలోపేతం చేయడం, స్థానిక సమస్యలు, ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది..
కేసీఆర్ ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని భోజనం పెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఇందిరమ్మ ప్రభుత్వంలో మెస్ చార్జీలతో పాటు కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా చేసుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదని... ఆయనకు భూములు, రియల్ ఎస్టేట్ల మీద మాత్రమే ప్రేమ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో ఆదరణ లేకపోవడంతోనే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఈ ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.
బావ, బామ్మర్థులతో అవ్వట్లేదని కేసీఆర్ను బయటకు తెచ్చారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. కేసీఆర్ బయటికి వచ్చిన తెలంగాణ రాజకీయంలో ఎలాంటి ప్రభావం ఉండదని విమర్శించారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సభలు పెడుతున్నారని ఆరోపించారు.
సోనియా గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. తెలంగాణ, ఏపీలో మోదీ జీరో అని ఎద్దేవా చేశారు. మోదీ హామీలపై, కాంగ్రెస్ హామీలపై కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు సిద్ధమా..? అని ఛాలెంజ్ చేశారు.
మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.255 కోట్ల ట్రిప్స్ పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన బహిరంగ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు తీరుపై విమర్శలు చేస్తూ సాగింది.
ఒక నెలలోపు పెండింగులో ఉన్న పదవులు అన్నీ భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్ఫష్టం చేశారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి తమ ప్రభుత్వానికి అపూర్వ ఆదరణ వస్తోందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సర్పంచ్లను కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.
తనపై ఎవరు ఏమి చేస్తున్నారు.. ఎవరేం చెబుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి అయ్యాక ఇటీవల జరిగిన పరిణామాలన్నీ చెబుతానని పేర్కొన్నారు.