సిందూరం అంటే రక్త సిందూరమా?
ABN, Publish Date - May 08 , 2025 | 04:53 AM
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టు పట్ల నెటిజన్లు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి పోస్టు
ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలి బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్టు పట్ల నెటిజన్లు, రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సిందూరం అంటే రక్త సిందూరం లాంటిదా? నేనేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకునేదాన్ని... యుద్ధాలు శవాలను, శకలాలను మిగులుస్తాయి కానీ శాంతిని కాదు’’ అంటూ ఆమె ఫేస్బుక్లో బుధవారం పోస్టు చేశారు. ఇది వైరల్గా మారింది.
ఆ పోస్టుపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ను ఎగతాళి చేసిన ప్రొ.సుజాత ముమ్మాటికి దేశ ద్రోహేనంటూ బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ను తప్పుబట్టేవిధంగా ఆమె వ్యవహరించిన తీరు దుర్మార్గమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర విద్యాకమిషన్ సభ్యురాలిగా ఉండి సుజాత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేసి, విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News
Updated Date - May 08 , 2025 | 04:53 AM