Minister Satya Prasad: త్వరలో జిల్లాల పేర్లు మార్పు.. అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు...
ABN, Publish Date - Aug 11 , 2025 | 02:55 PM
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు.. సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు.. సరిహద్దుల మార్పులపై ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి కానుంది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు.. సిద్ధం అయ్యింది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు.. సరిహద్దుల మార్పులపై కసరత్తు చేస్తుంది. ఈనెల 13వ తేదీన జీవోఎం భేటి కానుంది. తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి వినతులకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అయితే.. ఈ పేర్ల మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతుందనే చర్చ జరుగుతోంది.
Updated Date - Aug 11 , 2025 | 02:58 PM