Home » Minister Narayana
బిహార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యాత్రికుల మృతిపై మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
రైతులను వైసీపీ రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు.
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహ మార్గాలను, పెనుమాక రిజర్వాయర్ను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలను డంపింగ్ యార్డుల రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లు ఉన్నాయని, కొత్తగా మరో ఆరు ప్లాంట్లను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా వందశాతం స్వచ్ఛాంద్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట అన్న క్యాంటీన్లను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.
అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్ని కుదించుకుంటున్నారు.
ఈనెల13న ప్రారంభమయ్యే పార్టీ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం జరగనున్న కిసాన్ సేజ్ ప్రాంతాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పరిశీలించారు.