Home » Minister Narayana
గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ సోమవారం అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ‘నైస్, గుడ్, గ్రేట్ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలంటూ గేట్స్ కొనియాడారు..
శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.
అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కోసం మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా, 2012లో లండన్లో ఒలింపిక్ క్రీడలు జరిగిన ప్రాంతాలను ఈ బృందం పరిశీలించనుంది.
మంత్రి నారాయణ బృందం లండన్కు చేరుకుంది. అమరావతి నిర్మాణంలో భాగంగా అక్కడ పలు ప్రాజెక్టులను మంత్రి అధ్యయనం చేయనున్నారు.
నెల్లూరును కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు రూ.11 కోట్ల 75 లక్షలతో రోడ్ల పనులు చేపట్టామని మంత్రి నారాయణ తెలిపారు. మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు.
అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ జరుగుతోందని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్కు ఇచ్చారని పేర్కొన్నారు..
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ఊపందుకుంది. పల్నాడు జిల్లాలోని కర్లపూడి - లేమల్లెలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను మంత్రి నారాయణ ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేకు రైతులు ఘన స్వాగతం పలికారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించటమే ఎన్డీయే ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అవుటర్ రింగ్ రోడ్డు వేయాలన్నది నుడా చైర్మన్ ఉద్దేశమని.. ఆయన ఆలోచన మంచిదేనని పేర్కొన్నారు..
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని తమకు పూర్తి క్లారిటీ ఉందని.. రాజధానిపై వైసీపీ కూడా స్పష్టత ఇవ్వాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సమీప గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పనులు సుమారు రూ.900కోట్లతో జరుగుతున్నాయని వెల్లడించారు.