Home » AP Politics
వైసీపీ శ్రేణులు యథేచ్ఛగా రెచ్చిపోతున్న ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో బరితెగించిన కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలోనూ అదే ధోరణి కొనసాగిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సేప్టీ టూరిజం పాలసీ రావాలని తాను స్పష్టంగా చెప్పానని ప్రస్తావించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఫ్యాన్ పార్టీలో గ్రూపు విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు వరుసగా రాజీనామాలు చేయడం సంచలనంగా మారింది.
వైసీపీ మాజీ మంత్రులు తనపై పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. కొందరూ వ్యవస్థలో లొసుగులను ఉపయోగించి పనిచేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర ప్రజలను ఉత్సుకతకు గురిచేస్తున్నాయి. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం వేళ తెలుగుదేశం పార్టీలో పలువురు చేరారు. ఈ సంఘటన వైసీపీకి భారీ షాక్ అని చెప్పొచ్చు.
వైసీపీలో మరోసారి కుమ్ములాటలు బయటపడ్డాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53వ పుట్టిన రోజు వేడుకలను వైసీపీ నేతలు నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో జరిగిన బర్త్డే వేడుకలు చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.
అరెస్టు భయంతో హైకోర్టును మాజీ ఎమ్మెల్యే వంశీ ఆశ్రయించారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ను లంచ్ మోషన్గా విచారణ చేయాలని అభ్యర్థించారు.
జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. గోపాలపురం మండలానికి చెందిన సుమారు 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకేసారి మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.