Karnataka Tourism: మీరు ఎప్పుడైనా కర్ణాటక వెళ్తే.. ఇక్కడికి తప్పకుండా వెళ్లండి..
ABN, Publish Date - Oct 14 , 2025 | 06:36 AM
కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు పర్యటకులను ఎప్పుడు ఆకర్షిస్తుంటాయి. హంపి(చారిత్రక శిథిలాలు), మైసూరు (ఆకర్షణీయమైన రాజభవనం), బెంగుళూరు (రాజధాని నగరం), కూర్గ్ (ప్రకృతి సౌందర్యం), బేలూరు-హళేబీడు (ప్రాచీన దేవాలయాలు), గోకర్ణ (ఆధ్యాత్మిక ప్రదేశం మరియు బీచ్). ఈ ప్రదేశాలు వాటి చారిత్రక ప్రాధాన్యత, సాంస్కృతిక ప్రాముఖ్యత, సహజ సౌందర్యం, ఆధ్మాత్మికతకు ప్రసిద్ధి చెందాయి. తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రం తెలుగు, కన్నడ సంస్కృతిలను కలిగి ఉంటుంది.
కూర్గ్: భారతదేశ స్కాట్లాండ్గా ప్రసిద్ధి చెందింది. ఇది కాఫీ తోటలు, పచ్చదనంతో నిండి ఉంటుంది.
జోగ్ జలపాతం: భారతదేశంలో రెండవ ఎత్తైన జలపాతం. కర్ణాటకలో అత్యంత ఎత్తైన జలపాతం. ఇది ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.
మైసూర్: చారిత్రక మైసూర్ ప్యాలెస్, గంభీరమైన వాస్తుశిల్పానికి పేరుగాంచిన నగరం.
బేలూరు హళేబీడు: హొయసల సామ్రాజ్యానికి చెందిన అద్భుతమైన ఆలయ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశాలు.
హంపి: విరూపాక్ష దేవాలయంతో సహా అనేక పురాతన ఆలయాలు, శిధిలాలతో కూడిన చారిత్రక నగరం.
బందిపూర్ నేషనల్ పార్క్: పులులు, ఏనుగులు ఇతర వన్యప్రాణులకు నిలయమైన ఒక ప్రసిద్ధ అభయారణ్యం.
Updated Date - Oct 14 , 2025 | 06:37 AM