Home » Tourist Places
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ప్రకృతి అందాలను అభివృద్ధి చేయడం ద్వారా నేడు అద్భుతమైన ప్రదేశాలుగా మారాయని వివరించారు. పర్యాటక రంగంలో సుస్థిరమైన మార్పు వచ్చిందని చెప్పడానికి ఏపీ ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
పర్యాటక రంగం డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శిల్పారామంలో టూరిజం కాంక్లేవ్ శనివారం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు.
విశ్రాంతి కోసం చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. అయితే, ప్రపంచంలో టూరిస్టులు ఎక్కువగా వెళ్లే దేశం ఏదో తెలుసా?
విదేశాల్లో విహరించాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది.కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయని భావించి ఆ కోరికను పక్కనపెట్టేస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ఒకే ప్యాకేజీలో మలేసియా, సింగపూర్ దేశాలను కవర్ చేస్తూ.. అతితక్కువ ధరకే విదేశీ పర్యటన చేసే అవకాశం కల్పిస్తోంది.
స్విస్ దేశపు శైలి పచ్చిక బయళ్లు మొదలు, మధ్యధరా సముద్రాల వరకు ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. అయితే, వాటికి ఏమాత్రం తీసిపోని టూరిస్ట్ ప్లేసెస్ ఇండియాలోనే ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా..
మన దేశంలో కొన్ని అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైన్స్ కూడా ఎలా సాధ్యమని ఆశ్చర్యపోతుంది. ఈ స్థలాలు కేవలం ఆధ్యాత్మికమే కాదు, శాస్త్రవేత్తల పరిశోధనకు కూడా ఆసక్తికరంగా మారాయి. అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
కర్ణాటకలోని ప్రకృతి సోయగాలను ఒకే టూర్లో సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC). కాఫీ విత్ కర్ణాటక టూర్ పేరిట తీసుకొచ్చిన ప్యాకేజీ కింద కేవలం రూ.12 వేలకే కూర్గ్, మైసూర్ సహా పలు పలు ప్రదేశాలను చుట్టేయొచ్చు.
నేచర్ లవర్స్ స్వర్గధామం.. కుంటాల వాటర్ఫాల్స్.. ఇది తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం. వర్షాకాలంలో పరవళ్లు తొక్కే కుంటాల జలపాత సోయగాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. హైదరాబాద్కు సమీపంలోనే ఉన్న ఈ వాటర్ ఫాల్స్ ప్రత్యేకలేంటి? ఎలా వెళ్లాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీరాముని జీవితానికి సంబంధించిన కీలక ప్రదేశాలను ఒకే టూర్ ద్వారా సందర్శించే అవకాశం కల్పిస్తోంది ఐఆర్సీటీసీ. ఇకపై భక్తులు రామాయణ యాత్ర ప్యాకేజీ ద్వారా కేవలం 17 రోజుల్లో 30 రామక్షేత్రాలను దర్శించుకోవచ్చు.
దక్షిణ భారతంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలను ఒకే ట్రిప్ ద్వారా చుట్టేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. జులై 28 నుంచి ప్రారంభం కానున్న ఈ 13 రోజుల యాత్రకు IRCTC టూరిజం అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..